News December 21, 2025
సిద్దిపేట: తీవ్ర విషాదం.. దంపతుల ఆత్మహత్య

పురుగు మందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన బెజ్జంకిలో జరిగింది. స్థానికుల వివరాలు.. మండలంలోని దాచారానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష, రుక్మిణి దంపతులు. వారు బెజ్జంకిలో బట్టల దుకాణం నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం భార్యాభర్తలు పురుగు మందు తాగారు. ఘటనా స్థలంలో భార్య మృతి చెందగా, భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దంపతుల మృతితో తీవ్ర విషాదం నెలకొంది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 26, 2025
ప్రత్యేక PGRSలో అర్జీలను స్వీకరించిన కలెక్టర్

జిల్లా అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని బాపట్ల కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన ఎస్టీలు, దివ్యాంగుల ప్రత్యేక PGRS కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎస్టీలు, దివ్యాంగుల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. వాటికి వెంటనే కలెక్టర్ పరిష్కార మార్గం చూపినట్లు వివరించారు.
News December 26, 2025
పింఛన్ లబ్ధిదారులకు కలెక్టర్ గుడ్ న్యూస్!

నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31నే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఒకరోజు ముందుగానే నగదు పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, నిర్దేశించిన సమయానికి పింఛన్ అందజేయాలని స్పష్టం చేశారు.
News December 26, 2025
ఈనెల 31 నుంచి యాసంగి పంటకు సాగునీటి విడుదల

LMD నుంచి కాకతీయ కాలువల ద్వారా ఈనెల 31న ఉ.11 గంటలకు రైతులకు యాసంగి పంటకు సాగునీటిని విడుదల చేయనున్నట్లు ఇరిగేషన్ సూపరింటెండింగ్ ఇంజినీర్ రమేశ్ తెలిపారు. నీటి పారుదల శాఖ కమిటీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు వారబందీ పద్ధతిలో జోన్ 1కు 7 రోజులు, జోన్ 2కు 8 రోజులు సాగునీటి విడుదల చేయనున్నట్లు తెలిపారు. సాగునీటిని వృథా కాకుండా పొదుపుగా వాడుకొని సహకరించాలని రైతులను కోరారు.


