News December 21, 2025
వేములవాడ: ఈనెల 24న అరుణాచలం ప్రత్యేక యాత్ర ……

వేములవాడ నుంచి తమిళనాడులోని అరుణాచల క్షేత్రానికి ఈనెల 24వ తేదీన ప్రత్యేక బస్సు యాత్ర ఏర్పాటు చేసినట్లు వేములవాడ ఆర్టీసీ డిపో మేనేజర్ బి.శ్రీనివాస్ తెలిపారు. 25న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, 26న అరుణాచలం గిరి ప్రదక్షిణ, 27న తిరుమల, 28న జోగులాంబ అమ్మవారి దర్శనం ఉంటాయని, పెద్దలకు రూ. 6100, పిల్లలకు రూ.4850 చార్జీ ఉంటుందని వెల్లడించారు. వివరాలకు 99959225926 నంబర్ లో సంప్రదించాలన్నారు.
Similar News
News January 3, 2026
ప్రొద్దుటూరు: స్కాంలో అందరికీ వాటాలు.. అందుకే గప్చుప్.!

ప్రొద్దుటూరు మున్సిపల్ పెట్రోల్ బంక్ <<18748515>>స్కాంలో<<>> అందరికీ వాటాలు ఉండడంతోనే చర్యలు లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బంక్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ నుంచి మున్సిపల్ అధికారులకు, పాలకవర్గానికి, అధికార పార్టీ నేతలకు వాటాలు వెళ్తుండడంతోనే చర్యలు తీసుకోవడం లేదని కొందరు విమర్శిస్తున్నారు. క్రెడిట్ కార్డ్ స్వైప్ ద్వారా, అప్పుల పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టినా కేసు పెట్టకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
News January 3, 2026
అడ్డరోడ్డు ‘రెవెన్యూ’ పంచాయితీ!

అడ్డరోడ్డు కేంద్రంగా రాజకీయ రగడ చెలరేగింది. ఇక్కడ RDO కార్యాలయం ప్రారంభించడం వెనుక కూటమి నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. హోంమంత్రి అనిత కృషితో డివిజన్ వచ్చిందని TDP సంబరాలు చేసుకోగా.. జనసేన MLA విజయ్ కుమార్ అసంతృప్తిగా ఉన్నట్లు చర్చ సాగుతోంది. ప్రారంభ కార్యక్రమానికి కూడా MLA హాజరు కాకపోవడంతో రాజకీయ చర్చకు దారితీసింది.
News January 3, 2026
నేడు ఉల్లి రైతుల ఖాతాల్లోకి డబ్బులు

AP: ప్రకృతి వైపరీత్యాలు, ధరల పతనంతో నష్టపోయిన ఉల్లి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. ఖరీఫ్లో ఉల్లి సంక్షోభాన్ని ప్రభుత్వం గుర్తించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కర్నూలు, కడప జిల్లాలకు చెందిన 37,752 మంది రైతుల అకౌంట్లలో రూ.128.33 కోట్లను ఈరోజు జమ చేయనున్నారు. కర్నూల్ జిల్లాల్లోనే 31,352 మంది ఖాతాల్లో రూ.99.92కోట్లు జమ కానున్నట్లు పేర్కొన్నారు.


