News December 21, 2025

వేములవాడ: ఈనెల 24న అరుణాచలం ప్రత్యేక యాత్ర ……

image

వేములవాడ నుంచి తమిళనాడులోని అరుణాచల క్షేత్రానికి ఈనెల 24వ తేదీన ప్రత్యేక బస్సు యాత్ర ఏర్పాటు చేసినట్లు వేములవాడ ఆర్టీసీ డిపో మేనేజర్ బి.శ్రీనివాస్ తెలిపారు. 25న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, 26న అరుణాచలం గిరి ప్రదక్షిణ, 27న తిరుమల, 28న జోగులాంబ అమ్మవారి దర్శనం ఉంటాయని, పెద్దలకు రూ. 6100, పిల్లలకు రూ.4850 చార్జీ ఉంటుందని వెల్లడించారు. వివరాలకు 99959225926 నంబర్ లో సంప్రదించాలన్నారు.

Similar News

News January 12, 2026

గద్వాల: జిల్లాల పునర్విభజన ప్రకటనతో సరిహద్దు ప్రజల్లో అయోమయం

image

రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనపై రిటైర్డ్ జడ్జితో కమిటీ వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన జోగులాంబ గద్వాల జిల్లా సరిహద్దు గ్రామాల ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గుర్రంగడ్డ, ఎర్రవల్లి, ధరూర్ మండలాల గ్రామాలతో పాటు, కొత్తగా ఏర్పడిన ఉండవెల్లి, కేటిదొడ్డి మండలాల ప్రజలు తమ ప్రాంతాల భవిష్యత్తుపై సందిగ్ధంలో ఉన్నారు. భౌగోళిక మార్పులు ఎలా ఉంటాయోనని స్థానికులు చర్చించుకుంటున్నారు.

News January 12, 2026

ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసే సిద్ధాంతబద్ధమైన పార్టీ కాంగ్రెస్: వరంగల్ MP

image

కాంగ్రెస్ పార్టీ అంటే పదవుల కోసం కాదు, ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసే సిద్ధాంతబద్ధమైన పార్టీ అని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. హనుమకొండ DCC ఆఫీస్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎంపీ హాజరై మాట్లాడారు. ప్రజలు కాంగ్రెస్‌పై పెట్టుకున్న విశ్వాసాన్ని మరింత పటిష్ఠం చేసే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలదేనని పేర్కొన్నారు.

News January 12, 2026

ఆదాయం రూ.18వేల కోట్లు, అప్పులకు రూ.22వేల కోట్లు: CM

image

TG: గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోపి వెళ్లిందని <<18837053>>CM<<>> రేవంత్ విమర్శించారు. ‘ప్రభుత్వ ఆదాయం రూ.18 వేల కోట్లు. కానీ ప్రతి నెలా రూ.22 వేల కోట్లు అప్పులకు చెల్లిస్తున్నాం. ప్రభుత్వాన్ని నడిపేది కేవలం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదు. 10.50 లక్షల మంది ఉద్యోగులు కూడా ఇందులో భాగస్వాములే. గతంలో మీ జీతాలు ఎప్పుడొచ్చేవి.. ప్రస్తుతం ఎప్పుడు వస్తున్నాయో ఆలోచించండి’ అని అన్నారు.