News December 21, 2025

కొత్త ఛార్జీలు ప్రకటించిన రైల్వే

image

రైలు ఛార్జీలను రైల్వే సవరించింది. 215KM కంటే ఎక్కువ దూర ప్రయాణాలకు ఆర్డినరీ క్లాసులో KMకు ఒక పైసా చొప్పున పెంచింది. మరోవైపు మెయిల్/ఎక్స్‌ప్రెస్ నాన్-ఏసీ, ఏసీ తరగతులకు KMకు 2 పైసల చొప్పున ఛార్జీలను పెంచింది. ఈ ధరలు ఈనెల 26 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఈ మార్పులతో రూ.600 కోట్ల ఆదాయం వస్తుందని తెలిపింది. నాన్ AC కోచ్‌లలో 500 KM జర్నీ చేస్తే ఒక్కో ప్రయాణికుడికి రూ.10 అదనంగా ఖర్చు కానుంది.

Similar News

News January 12, 2026

విజయ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం

image

కరూర్ తొక్కిసలాటపై TVK చీఫ్ విజయ్‌పై CBI ప్రశ్నల వర్షం కురిపించింది. ‘బహిరంగ సభకు ఆలస్యంగా ఎందుకు వచ్చారు? రాజకీయశక్తిని ప్రదర్శించడం కోసమే అలా చేశారా? జనసమూహంలో కారు నుంచి ఎందుకు బయటకు వచ్చారు? సభలో ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నా మీరెందుకు ప్రసంగం కొనసాగించారు? నీళ్ల బాటిళ్లను ఎందుకు పంపిణీ చేశారు?’ అని ప్రశ్నించింది. ర్యాలీకి ముందు పార్టీ నేతలతో సమావేశాలపైనా ఆరా తీసింది.

News January 12, 2026

ఉద్యోగం భద్రంగా ఉండాలంటే?

image

ఏ సంస్థలైనా తక్కువతో ఎక్కువ లాభం వచ్చే వనరులపైనే ప్రధానంగా దృష్టి పెడతాయి. కాబట్టి ఎలాంటి స్థితిలోనైనా బాధ్యత తీసుకునే తత్వం ఉండాలి. పలానా వ్యక్తి పనిచేస్తే పక్కాగా ఉంటుందనే పేరును తెచ్చుకోవాలి. ఇది ఒక్కరోజులో వచ్చేది కాదు కాబట్టి దానికోసం శ్రమించాలి. పని గురించి అప్డేట్‌గా ఉండాలి. ఎన్ని బాధ్యతలున్నా మరీ ఎక్కువగా సెలవులు పెట్టకూడదు. ఆఫీసుకు వెళ్లేది పనిచేసేందుకే కాబట్టి దానిపై దృష్టి పెట్టాలి.

News January 12, 2026

గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్(<>GSL<<>>) 10 ఎక్స్‌పర్ట్/స్పెషలిస్టు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జనవరి 31వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, డిప్లొమా అర్హతతో పాటు పనిఅనుభవం గల వారు అర్హులు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://goashipyard.in.