News December 21, 2025

జగిత్యాల: ధాన్యం అమ్మి 15 రోజులైనా.. అందని పైసలు

image

జగిత్యాలరూరల్(M) తక్కళ్ళపల్లి శివారులోని ఓ రైస్ మిల్లుకు వివిధ కేంద్రాల ద్వారా 200 మంది రైతులకు చెందిన సుమారు 10 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని అధికారులు తరలించారు. అయితే, సివిల్ సప్లయ్ అధికారులు మాత్రం వాటికి సంబంధించిన ROలను జారీచేయడం లేదు. దీంతో రైతులకు 48 గంటల్లో పడాల్సిన ధాన్యం డబ్బులు 15 రోజులైనా పడక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ డబ్బులు ఇప్పించాలని రైతులు కోరుతున్నారు.

Similar News

News January 8, 2026

బలపడిన వాయుగుండం.. తుఫానుగా మారే ఛాన్స్!

image

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం ఇవాళ తీవ్ర వాయుగుండంగా మారనుందని IMD తెలిపింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయంది. తర్వాత ఈ తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే ఛాన్స్ కూడా ఉంది. దీంతో అధికారులు వైజాగ్, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, గంగవరం పోర్టులకు ఒకటో నంబర్ తుఫాను హెచ్చరిక జారీ చేశారు.

News January 8, 2026

కాకినాడ: కేజీబీవీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

తొండంగి మండలం వాకదారిపేటలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో పలు ఔట్సోర్సింగ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖాధికారులు తెలిపారు. ఏఎన్ఎం, ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్‌లో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 11 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు, పూర్తి వివరాలకు MEO, DEO కార్యాలయాలను సంప్రదించలన్నారు.

News January 8, 2026

ప్రధాని మోదీ ఆస్తులు ఎంతంటే?

image

PM నరేంద్ర మోదీ ఆస్తుల విలువ రూ.3.02 కోట్లకు చేరిందని ఏడీఆర్ (Association for Democratic Reforms) నివేదిక వెల్లడించింది. 2014తో పోలిస్తే పదేళ్లలో ఆయన ఆస్తులు 82% పెరిగాయి. ఇక లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆస్తులు 2014లో రూ.9.4 కోట్లుగా ఉండగా, 2024 నాటికి రూ.20.39 కోట్లకు చేరి 117% వృద్ధి నమోదైంది. వరుసగా 3 సార్లు గెలిచిన ఎంపీల సగటు ఆస్తులు కూడా పదేళ్లలో 110% పెరిగినట్లు ADR తెలిపింది.