News December 21, 2025
ప్రకృతి వ్యవసాయంతోనే స్థిర ఆదాయం: కలెక్టర్

రైతులంతా ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపినప్పుడే స్థిరమైన ఆదాయం లభిస్తుందని కలెక్టర్ బాలాజీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి పినగూడూరు లంకలోని అభ్యుదయ రైతు మేకపోతుల విజయరామ్ గురూజీ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. పాడి ఆవుల ద్వారా కేవలం పాలు అమ్మడమే కాకుండా, గోమయం, గోమూత్రంతో పూజా సామాగ్రి వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి అధిక లాభాలు గడించవచ్చని ఆయన అన్నారు.
Similar News
News January 5, 2026
కృష్ణా: ఏడాది తొలి వారంలో 417 అర్జీలు

మచిలీపట్నంలో కలెక్టర్ బాలాజీ జిల్లా అధికారులతో కలిసి PGRS సోమవారం నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. కలెక్టర్ బాలాజీ స్పందిస్తూ.. అన్ని అర్జీలను 72 గంటల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. PGRS ద్వారా ఇప్పటివరకు 95% అర్జీలు పరిష్కరించినట్లు తెలిపారు. ఈ ఏడాది తొలి వారంలో 417 అర్జీలు అందగా సమస్యల పరిష్కారాన్ని ఆన్లైన్లో సంక్షిప్త సందేశాల ద్వారా తెలియజేస్తున్నట్లు చెప్పారు.
News January 5, 2026
కృష్ణాజిల్లాలో మాజీ మంత్రులు పర్యటన ఇక్కడే..!

మాజీ కేంద్రమంత్రి, దగ్గుబాటి పురందేశ్వరి, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ ఛైర్మన్, మాజీ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా దగ్గుబాటి పురందేశ్వరి పెడన మండలం జింజేరు గ్రామంలో పర్యటించనున్నారు. అదేవిధంగా కొత్తపల్లి శామ్యూల్ జవహర్ పెడన పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో పర్యటించనున్నారు. దీంతో స్థానిక బీజేపీ, టీడీపీ నేతలు పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
News January 5, 2026
కృష్ణాజిల్లాలో మాజీ మంత్రులు పర్యటన ఇక్కడే..!

మాజీ కేంద్రమంత్రి, దగ్గుబాటి పురందేశ్వరి, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ ఛైర్మన్, మాజీ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా దగ్గుబాటి పురందేశ్వరి పెడన మండలం జింజేరు గ్రామంలో పర్యటించనున్నారు. అదేవిధంగా కొత్తపల్లి శామ్యూల్ జవహర్ పెడన పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో పర్యటించనున్నారు. దీంతో స్థానిక బీజేపీ, టీడీపీ నేతలు పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.


