News December 21, 2025

ఒంగోలు: సామాన్యుడి ఒక్క ట్వీట్.. ఎంత పని చేసిందంటే?

image

ఒక సామాన్య వ్యక్తి చేసిన ఒక్క ట్వీట్, రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఒంగోలు రైల్వేస్టేషన్ వద్ద గల పట్టాలపై ప్రయాణికులు దాటే పరిస్థితిని ఒకరు గమనించారు. రైలు వచ్చే క్రమంలో కూడా ప్రయాణికులు పట్టాలు దాటితే.. ఎంత ప్రమాదమో. ఒక ప్రయాణికుడు ఈ విషయాన్ని ఇండియన్ రైల్వేకు ట్వీట్ ద్వారా తెలిపాడు. ఇక అంతే ఉన్నతాధికారుల ఆదేశాలతో అధికారులు తనిఖీ చేసి నిన్న 10 మందిపై కేసులు నమోదు చేశారు.

Similar News

News January 10, 2026

ప్రకాశం: ‘సంప్రదాయ క్రీడలను నిర్వహించాలి’

image

కోడి పందేలు, జూదాలు వంటి అసాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ సందర్భంగా సంప్రదాయ క్రీడలను నిర్వహించాలన్నారు. ఎక్కడైనా కోడిపందేలు నిర్వహిస్తే 112 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. అలాగే 9121102266 వాట్సాప్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.

News January 10, 2026

ప్రకాశం: సంక్రాంతికి విద్యుత్ శాఖ సూచనలు

image

సంక్రాంతి పండుగ వేళ గాలిపటాలను ఎగరేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ SE కట్టా వెంకటేశ్వర్లు సూచించారు. ఒంగోలులోని తన కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. గాలిపటాలను ఎగరేసే సమయంలో సమీపంలో ఉన్న కరెంటు తీగలు, ట్రాన్స్ఫార్మర్లను గమనించాలన్నారు. గాలిపటాలు విద్యుత్ తీగలకు చిక్కుకున్న సమయంలో వాటిని తీయరాదన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.

News January 10, 2026

ప్రకాశం జిల్లాలో 11 మందికి పదోన్నతి

image

ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్ యాజమాన్యం పరిధిలోని వివిధ కార్యాలయాల్లో పని చేస్తున్న 11 మంది సీనియర్ సహాయకులకు పదోన్నతి కల్పించారు. ఆ ఉత్తర్వులను జెడ్పీ ఛైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ వారికి అందజేశారు. పదోన్నతి పొందిన వారిలో జి. సుగుణశోభారాణిని ఒంగోలు జెడ్పీకి, ఎం.శ్రీవాణిని ఒంగోలు జెడ్పీకి, ఎం. ఇందిరను మర్రిపూడి ఎంపీపీ, డి. ఖాసీంపీరాను బేస్తవారిపేట ఎంపీపీకి కేటాయించారు.