News December 21, 2025

ఈనెల 24 నుంచి ‘కరీంనగర్ కిసాన్ గ్రామీణ మేళా’

image

కరీంనగర్‌లో ఈనెల 24 నుంచి 26 వరకు కిసాన్ గ్రామీణ మేళా నిర్వహించనున్నట్లు కిసాన్ జాగరణ్ అధ్యక్షుడు పి.సుగుణాకర్ రావు తెలిపారు. రైతుల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా కరీంనగర్ “కిసాన్ గ్రామీణ మేళా” నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News December 28, 2025

జమ్మికుంట: అంబేద్కర్ వర్సిటీ పరీక్షా ఫీజు గడువు పొడిగింపు

image

డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు పరీక్షా ఫీజు చెల్లించే గడువును జనవరి 2వ తేదీ వరకు పొడిగించినట్లు జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ బి.రమేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దూరవిద్య విధానంలో బి.ఏ, బి.కామ్‌, బి.ఎస్సీ చదువుతున్న మొదటి, మూడు, ఐదో సెమిస్టర్‌ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News December 28, 2025

KNR: ఇసుక అక్రమ రవాణా.. 170 కేసులు

image

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరంలో 170 ఇసుక అక్రమ రవాణా కేసులు నమోదు కాగా.. 249 మంది పట్టుబడ్డారు. వీరి నుంచి 8 ట్రాక్టర్లు, 7 లారీలు, 3 టిప్పర్స్, 3 జేసీబీలు, 3 బొలెరో వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ఇసుక ఖరీదు ₹6,75,500 ఉందని సీపీ గౌస్ ఆలం పేర్కొన్నారు. పోలీసులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నా ఇసుక మాఫియాకు అడ్డుకట్ట పడడం లేదు.

News December 28, 2025

KNR: ఇసుక అక్రమ రవాణా.. 170 కేసులు

image

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరంలో 170 ఇసుక అక్రమ రవాణా కేసులు నమోదు కాగా.. 249 మంది పట్టుబడ్డారు. వీరి నుంచి 8 ట్రాక్టర్లు, 7 లారీలు, 3 టిప్పర్స్, 3 జేసీబీలు, 3 బొలెరో వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ఇసుక ఖరీదు ₹6,75,500 ఉందని సీపీ గౌస్ ఆలం పేర్కొన్నారు. పోలీసులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నా ఇసుక మాఫియాకు అడ్డుకట్ట పడడం లేదు.