News April 22, 2024
వైభవంగా శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు ప్రారంభం

తిరుపతి శ్రీకోదండరామస్వామి తెప్పోత్సవాలు ఆదివారం శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులను రామచంద్ర పుష్కరిణికి వేంచేపు చేశారు. రాత్రి తెప్పోత్సవం నిర్వహించారు.
Similar News
News January 14, 2026
చిత్తూరు కోర్టులో ఉద్యోగాలు

చిత్తూరు జిల్లా కోర్టులో పర్మినెట్ ఉద్యోగాల నియామకానికి ప్రధాన న్యాయమూర్తి మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. రికార్డు అసిస్టెంట్-1, డేటా ఎంట్రీ ఆపరేటర్-1, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్-1 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈనెల 27వ తేదీలోపు దరఖాస్తుకు చేసుకోవాలి. అర్హత, జీతం తదితర వివరాలకు చిత్తూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాన్ని సంప్రదించాలి.
News January 14, 2026
సంక్రాంతి పండుగ ఐక్యత నింపాలి: కలెక్టర్ సమిత్ కుమార్

సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, ఐక్యత నింపాలని జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిమళం వెదజల్లేలా ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల నడుమ సుహృద్భావ వాతావరణంలో, ఆనందంగా జరుపుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
News January 14, 2026
సంక్రాంతి పండుగ ఐక్యత నింపాలి: కలెక్టర్ సమిత్ కుమార్

సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, ఐక్యత నింపాలని జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిమళం వెదజల్లేలా ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల నడుమ సుహృద్భావ వాతావరణంలో, ఆనందంగా జరుపుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.


