News December 22, 2025
నేడు కలెక్టరేట్లో ఎంప్లాయిస్ గ్రీవెన్స్: కలెక్టర్

మచిలీపట్నంలోని కలెక్టరేట్లో నేడు ఎంప్లాయిస్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉదయం 10.30 నుంచి మీకోసం కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు తెలిపారు.
Similar News
News February 1, 2026
రేపు కలెక్టరేట్లో PGRS, రెవెన్యూ క్లినిక్: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం (PGRS) కార్యక్రమాన్ని సోమవారం ఉదయం కలెక్టరేట్లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా అధికారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారన్నారు. అలాగే ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో రెవెన్యూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్టు కలెక్టర్ తెలిపారు.
News February 1, 2026
కంకిపాడుకి చెందిన సినీ నటుడు రఘునాథ్ రెడ్డి మృతి

చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. కంకిపాడుకి చెందిన ప్రముఖ సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి గుండెపోటుతో ఆదివారం కన్నుమూశారు. తెలుగు, హిందీ, తమిళం, భోజ్పురి భాషల్లో దాదాపు 370కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన ఆయన, బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేశారు. కొన్ని నెలల క్రితమే ఆయన కుమారుడు కూడా గుండెపోటుతో మరణించగా, ఇప్పుడు రఘునాథ్ రెడ్డి మృతితో ఆ కుటుంబం తీవ్ర శోకసముద్రంలో మునిగిపోయింది.
News February 1, 2026
అవనిగడ్డ అమ్మాయికి గ్రూప్–2లో ఉద్యోగం

అవనిగడ్డకు చెందిన సుధారాణి గ్రూప్–2 పరీక్షలో సెక్రటేరియట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం విశాఖపట్నంలో తపాలా శాఖ ఉద్యోగినిగా విధులు నిర్వహిస్తున్న ఆమె తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించారు. స్థానిక పాఠశాలలో చదివిన సుధారాణి పదో తరగతిలో 10 పాయింట్లు సాధించారు. 2016లో గ్రామీణ డాక్ సేవక్గా ఉద్యోగ జీవితం ప్రారంభించి, హెడ్ పోస్ట్ ఆఫీస్ పోస్టు ఉమెన్గా పనిచేశారు.


