News December 22, 2025
అన్నమయ్య జిల్లాలో 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య

అన్నమయ్య జిల్లా కేవీ పల్లి (M) కరణంవారి పల్లికి చెందిన రాచపల్లి నాగచైతన్య (15) మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. చౌడేపల్లి జడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతూ ఎస్సీ హాస్టల్లో ఉంటున్న అతడు శనివారం మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. చదువుపై తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై రాత్రి ఇంటి వరండాలో ఉరి వేసుకున్నట్లు సమాచారం. గమనించి వెంటనే పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. మార్గమధ్యంలో మృతి చెందాడు.
Similar News
News January 7, 2026
MBNR: SSC, INTER.. ఫీజు చెల్లించండి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఓపెన్ SSC, INTERలో చేరే విద్యార్థులు ఎగ్జామ్ ఫీ చెల్లించాలని ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్(TOSS) కో-ఆర్డినేటర్ శివయ్య తెలిపారు. ఈ నెల 16లోగా(ఫైన్తో) ఎగ్జామ్ ఫీ ఆన్లైన్లో చెల్లించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు www.telanganaopenschool.org వెబ్ సైట్లో సందర్శించాలన్నారు.
#SHARE IT
News January 7, 2026
MBNR: T20 లీగ్.. పాలమూరు విజయం

HCA ఆధ్వర్యంలో నిర్వహించిన ‘T20 కాకా స్మారక క్రికెట్ లీగ్’లో పాలమూరు ఘన విజయం సాధించింది. సిద్దిపేటలో జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన WGL జట్టు 20 ఓవర్లలో 142/7 పరుగులు చేసింది. MBNR జట్టు 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. MBNR జట్టు ఆటగాడు అబ్దుల్ రాఫె-79* పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచాడు. వారిని MDCA ప్రధాన కార్యదర్శి రాజశేఖ్, కోచ్లు అభినందించారు.
News January 7, 2026
ఛార్జీలు పెంచితే బస్సులు సీజ్: రవాణా శాఖ

AP: సంక్రాంతి రద్దీని ఆసరాగా చేసుకునే ప్రైవేట్ ఆపరేటర్లు ఛార్జీలు పెంచితే బస్సులు సీజ్ చేస్తామని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మనీశ్ కుమార్ హెచ్చరించారు. అధికారులు నిత్యం ధరలను మానిటర్ చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ఏపీకి తిరిగే బస్సులపై ప్రత్యేక దృష్టిసారించినట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నట్లు చెప్పారు.


