News April 22, 2024
నాదెండ్ల: ఈతకు వెళ్లి ఇద్దరు పిల్లలు మృతి

నాదెండ్ల మండల పరిధిలోని తూబాడు గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. తూబాడు చిరుమామిళ్ళ గ్రామాల మధ్యనున్న సాగర్ కాలువలో ఈత కొడదామని వెళ్ళిన ఇద్దరు చిన్నారులు షేక్ సిద్దిక్ (15), షేక్ అత్తర్ (15) నీట మునిగి చనిపోయారు. నీటి ప్రవాహానికి కాలువలో కొట్టుపోవడంతో గమనించిన స్థానికులు బయటకు తీసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News March 12, 2026
అమరావతి: ‘నాణ్యతతో హైకోర్టు నిర్మాణం పూర్తి చేయాలి’

అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను AGICL ఎండీ SVR శ్రీనివాస్ గురువారం పర్యవేక్షించారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ (AGC) ఇన్ఫ్రా, హైకోర్టు సైట్లను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. గుత్తేదారులు, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైకోర్టు భవన సముదాయాన్ని లక్ష్యానికి అనుగుణంగా నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
News March 12, 2026
అమరావతి: ‘నాణ్యతతో హైకోర్టు నిర్మాణం పూర్తి చేయాలి’

అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను AGICL ఎండీ SVR శ్రీనివాస్ గురువారం పర్యవేక్షించారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ (AGC) ఇన్ఫ్రా, హైకోర్టు సైట్లను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. గుత్తేదారులు, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైకోర్టు భవన సముదాయాన్ని లక్ష్యానికి అనుగుణంగా నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
News March 12, 2026
గ్యాస్ సిలిండర్లకు కొరత లేదు: జేసీ

గృహావసర ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. ఇరాన్ యుద్ధం కారణంగా సరఫరా ఆగుతుందనే సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. అవసరం లేకుండా రీఫిల్ బుకింగ్ చేయవద్దన్నారు. గుంటూరులో తనిఖీల్లో వ్యాపార సంస్థల్లో వాడుతున్న 66 డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకుని 14 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.


