News April 22, 2024
బాన్సువాడ: 25న కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాక

బాన్సువాడ పట్టణానికి ఈనెల 25న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వస్తున్నట్లు అధ్యక్షురాలు అరుణతార తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు చెప్పారు. వీక్లీ మార్కెట్లో బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బిబి పాటిల్ కు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నుంచి ఉన్నట్లు చెప్పారు.
Similar News
News March 10, 2026
TUలో అంతర్ కళాశాలల ఖో-ఖో జట్ల ఎంపికలు

TU పరిధిలోని డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కళాశాలల ఖో-ఖో (పురుషుల, మహిళల) జట్ల ఎంపిక మంగళవారం ప్రారంభమైంది. వర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ డా. జి. బాలకిషన్ మాట్లాడుతూ, ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు కర్ణాటకలోని దావణగెరె యూనివర్సిటీలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ (2025-26) పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి వర్సిటీకి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
News March 10, 2026
NZB: రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్..!

నిజామాబాద్ పట్టణంలో మంగళవారం నిర్వహించిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రంజాన్ మాసం సహనం, సోదరభావానికి ప్రతీక ఆన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. పేద ముస్లింలు పండగను సంతోషంగా జరుపుకోవాలని రంజాన్ తోఫా అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
News March 10, 2026
NZB: ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్ హెచ్చరిక

NZB జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక అక్రమ రవాణా జరగకూడదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరిక జారీ చేశారు. ఇసుకను అక్రమంగా తవ్వకం లేదా రవాణా చేస్తే సంబంధిత వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. జిల్లాలో ఇసుక అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మన ఇసుక వాహనం ఇసుక ఆన్లైన్ యాప్ ద్వారానే అనుమతులు తీసుకొని రవాణా చేసుకోవాలని సూచించారు.


