News December 22, 2025
అల్లూరి: చికిత్స పొందుతూ విద్యార్థి మృతి

ఎటపాక మండలం K.N.పురం బాలుర ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న తెల్లం గౌతం అనారోగ్యం కారణంగా సోమవారం ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. విద్యార్థిది ఎటపాక మండలం కృష్ణవరం. విద్యార్థి కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా గౌతమ్ 6వ తరగతి నుంచి అదే స్కూల్లో చదువుతున్నాడు.
Similar News
News January 14, 2026
NLG: లండన్ వేదికగా చేనేత కళా వైభవం

చండూరుకు చెందిన చేనేత కళాకారుడు చిలుకూరి శ్రీనివాస్ అంతర్జాతీయ వేదికపై భారతీయ చేనేత నైపుణ్యాన్ని చాటనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు లండన్లో జరిగే ‘స్ప్రింగ్ ఫెయిర్’ వర్తక ప్రదర్శనలో చేనేత లైవ్ డెమో ఇచ్చేందుకు ఆయన ఎంపికయ్యారు. ఈ నెల 29న ఆయన లండన్ బయలుదేరనున్నారు. తన ఎంపికకు సహకరించిన కేంద్ర చేనేత సేవా కేంద్రం డైరెక్టర్ అరుణ్కు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.
News January 14, 2026
పాలక్ పనీర్ తంటా: ఇండియన్ స్టూడెంట్స్కు ₹1.80 కోట్ల పరిహారం

USలోని కొలరాడో వర్సిటీలో వివక్షకు గురైన ఇండియన్ Ph.D విద్యార్థులు ఆదిత్య ప్రకాష్, ఊర్మి భట్టాచార్య న్యాయపోరాటంలో నెగ్గారు. క్యాంపస్లో 2023లో పాలక్ పనీర్ వేడి చేస్తున్న టైమ్లో సిబ్బంది ఆ వాసనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం ముదిరి వారి డిగ్రీలను నిలిపివేసే వరకు వెళ్లడంతో కోర్టును ఆశ్రయించారు. ఫలితంగా వర్సిటీ వారికి దాదాపు ₹1.80 కోట్ల పరిహారం చెల్లించడంతో పాటు మాస్టర్స్ డిగ్రీలను అందజేసింది.
News January 14, 2026
వేరుశనగలో దిగుబడి పెరగాలంటే!

వేరుశనగలో పంట నాణ్యత, దిగుబడి పెరగడానికి జింక్ చాలా కీలకం. ఈ సూక్ష్మపోషకం తగ్గినప్పుడు మొక్కలో ఎదుగుదల ఉండదు. ఆకులు పసుపు రంగులోకి మారతాయి. ఈనెలకు ఇరువైపులా తుప్పురంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ లక్షణాలు కనిపించగానే లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని వారం వ్యవధిలో 2-3సార్లు పిచికారీ చేయాలి. ఎకరాకు 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ను 3 పంటలకొకసారి ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.


