News April 22, 2024

మాల్దీవులు: ముయిజ్జు పార్టీ ఘన విజయం

image

మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో ప్రెసిడెంట్ మహ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (PNC) ఘన విజయం సాధించింది. మొత్తం 93 సీట్లు ఉండగా, 88 స్థానాల ఫలితాలను ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. అందులో 66 సీట్లను ముయిజ్జు పార్టీ కైవసం చేసుకుని, స్పష్టమైన మెజారిటీతో మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. కాగా, ముయిజ్జు చైనాకు విధేయుడిగా ఉన్నారు.

Similar News

News March 30, 2026

వాహనదారులకు షాక్.. పెరిగిన CNG ధర

image

TG: CNG వాహనదారులకు షాక్ తగిలింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దిగుమతికి ఆటంకంతో సరఫరా మరింత తగ్గింది. ఇదే సాకుతో గ్యాస్ కంపెనీలు ధరలు పెంచేస్తున్నాయి. 3 రోజుల క్రితం వరకు కిలోపై అదనంగా ₹1 చొప్పున వసూలు చేసిన HYDలోని ఓ PVT గ్యాస్ కంపెనీ ఆ తరువాత నుంచి మరో రూ.2 పెంచి విక్రయిస్తోంది. వారం కిందట ఈ ధర ₹96గా ఉండగా శనివారం నుంచి అన్ని బంకుల్లో KG ₹99 చొప్పున CNG స్టేషన్లలో వసూలు చేస్తున్నారు.

News March 30, 2026

1,100 సార్లు బాంబు బెదిరింపులు.. మొత్తానికి దొరికాడు!

image

దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకలోని మైసూరులో శ్రీనివాస్ లూయిస్(47)ను అదుపులోకి తీసుకున్నారు. స్కూళ్లు, హైకోర్టులు, ప్రభుత్వ బిల్డింగుల్లో బాంబులు పెట్టినట్లు 1,100కు పైగా బెదిరింపు మెయిల్స్ పంపాడని అధికారులు తెలిపారు. అతడు పీజీ చదివిన నిరుద్యోగి అని, మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు ప్రాథమికంగా తెలిసిందని పేర్కొన్నారు.

News March 30, 2026

AIFF చీఫ్ వేధించారు: మాజీ సీఎం కూతురు

image

ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్(AIFF) చీఫ్ కళ్యాణ్ చౌబే తనను వేధించారని మహిళా అధికారి వాలంకా అలెమావో ఆరోపించారు. మార్చి 29న జరిగిన AIFF ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో చౌబే, ఇతర అధికారులు హేళన చేసి వేధించారని ఫిర్యాదు చేశారు. ‘నాపై అనవసర, అగౌరవకర వ్యాఖ్యలు చేశారు. నన్ను భయపెట్టేందుకు హద్దులు దాటి మాట్లాడారు’ అని పేర్కొన్నారు. గోవా Ex CM చర్చిల్ అలెమావో కూతురైన వాలంకా AIFF మహిళా కమిటీ చీఫ్‌గా ఉన్నారు.