News April 22, 2024
కరీంనగర్ అభివృద్ధికి మీరేం చేశారో చెప్పండి: ఎంపీ అభ్యర్థి

కరీంనగర్ అభివృద్ధికి ప్రస్తుత ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిందేమీ లేదని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ ఆరోపించారు. బియినపల్లిలె ఆదివారం ఆయన మాట్లాడుతూ.. 2014-19లో ఆయన తాను ఎంపీగా ఉన్నప్పుడు కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ తెచ్చినట్లు పేర్కొన్నారు. వెయ్యి కోట్లతో స్మార్ట్ సిటీ తీసుకొచ్చానన్నారు. బండి సంజయ్ కులం, మతం పేరు చెప్పి రాజకీయ్ చేస్తున్నారని విమర్శించారు.
Similar News
News January 8, 2026
కరీంనగర్: మితిమీరిన వేగం ప్రాణాంతకం: డీటీసీ

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా నుస్తులాపూర్ వద్ద రవాణా, ట్రాఫిక్ పోలీసులు ఉమ్మడిగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనాలు మితిమీరిన వేగంతో నడపడం ప్రాణాంతకమని డీటీసీ పురుషోత్తం పేర్కొన్నారు. ఎస్హెచ్-1 రహదారిపై తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన 10 వాహనాలకు జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ వేగ నియంత్రణ పాటించాలని సూచించారు.
News January 8, 2026
కొత్తపల్లి: అక్రమ ఇసుక రవాణాపై వేటు: కలెక్టర్

ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరించారు. బుధవారం సీపీ గౌస్ ఆలం తో కలిసి తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి ఇసుక క్వారీని ఆమె తనిఖీ చేశారు. ఎల్ఎండీ రిజర్వాయర్ పూడికతీత, ఇసుక వేరు చేసే ప్రక్రియను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. పరిమితికి మించి లోడింగ్ చేసిన, అనధికార వాహనాలు వినియోగించినా ఉపేక్షించబోమన్నారు.
News January 8, 2026
KNR: ‘బీసీ సబ్ప్లాన్ నిధులను విడుదల చేయాలి’

బీసీ సబ్ప్లాన్ నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ.. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో వినతిపత్రాన్ని అందజేశారు. పార్టీ అధ్యక్షలు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షలు గంగిపెళ్లి అరుణ, రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ చాంద్ పాషా ఉన్నారు.


