News December 22, 2025
గద్వాల: ఈనెల 24న ‘మీ డబ్బు-మీ హక్కు’ కార్యక్రమం

క్లెయిమ్ చేసుకోని ఆర్థిక ఆస్తుల కోసం ఈనెల 24న గద్వాల ఐడీఓసీలో ‘మీ డబ్బు-మీ హక్కు’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బి.ఎం.సంతోష్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇది జరుగుతుందని పేర్కొన్నారు. 10 ఏళ్లుగా బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలను ఆర్బీఐ ‘ఉద్గమ్’ (https://udgam.rbi.org.in) వెబ్సైట్ ద్వారా పొందవచ్చని సూచించారు.
Similar News
News December 28, 2025
రేపు శ్రీకాకుళం కలెక్టర్ గ్రీవెన్స్

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్ సైట్ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.
News December 28, 2025
ప్రకాశం: ఇద్దరు యువకులు స్పాట్డెడ్

గుంటూరు నగర శివారు 16వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. యువకులు బైక్పై గుంటూరు నుంచి ఒంగోలు వైపునకు బయలుదేరారు. చౌడవరం సమీపంలో బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది. మృతులు ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం గంగవరానికి చెందిన చాట్ల నాని, అశోక్గా పోలీసులు గుర్తించారు. నల్లపాడు పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.
News December 28, 2025
రేపు ప్రజావాణి యథాతధం: ASF కలెక్టర్

ఎన్నికల కోడ్ ముగియడంతో ఈ నెల 29వ తేదీ నుంచి ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో ప్రజావాణి కార్యక్రమం యథాతధంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి తమ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.


