News December 22, 2025

ప్రజల ఆరోగ్యంపై రాజీ వద్దు: కలెక్టర్

image

ఆహార కల్తీని అరికట్టి ప్రజలకు స్వచ్ఛమైన ఆహారం అందేలా చూడాలని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ భావనతో కలిసి ఆహార భద్రతా ప్రమాణాలపై (FSSAI) అవగాహన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఆహార పదార్థాల్లో కల్తీని గుర్తించే విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో DRO గంగాధర్ గౌడ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Similar News

News December 29, 2025

ఖమ్మం: చైనా మాంజా విక్రయించిన వినియోగించిన చర్యలు: సీపీ

image

పక్షులతో పాటు, ప్రజలకు ప్రమాదకరంగా మారిన చైనా మాంజాను ఎవరైనా విక్రయించిన, వినియోగించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఈ చైనా మాంజా (సింథటిక్ దారం, గాజు పొడి) చాలా ప్రమాదకరమని చెప్పారు. ఈ దారాన్ని ఉపయోగించడం ద్వారా పక్షుల గొంతు, రెక్కలు తెగిపోవడం, మనుషులకు గాయాలవుతాయన్నారు. ఎవరైనా చైనా మాంజాను విక్రయిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.

News December 29, 2025

వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ

image

వైకుంఠ ద్వారాలు తెరుచుకునే పవిత్ర పర్వదినాన శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందాలనుకుంటున్నారా? మీ ఆర్థిక, కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభించి, సకల ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నారా? అయితే మీకు వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ ఉత్తమమైనది. మీ పేరు, గోత్రనామాలతో జరిపించే సంకల్ప పూజ ద్వారా పాప విముక్తి పొంది, మోక్ష మార్గంలో పయనించవచ్చు. ఇప్పుడే వేదమందిర్‌లో మీ పూజను <>బుక్ చేసుకోండి<<>>.

News December 29, 2025

ములుగు జిల్లాలో మరోసారి పెద్దపులి కలకలం

image

ములుగు జిల్లాలో మరోసారి పెద్దపులి కలకలం రేపుతోంది. భూపాలపల్లి అడవి నుంచి ఆదివారం రాత్రి జాకారం వద్ద రోడ్డు దాటుతుండగా అంబులెన్స్ డ్రైవర్ గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పంది కుంట నర్సరీలోకి వెళ్లి కంచె దాటే క్రమంలో స్తంభం విరిగినట్లు అధికారులు నిర్ధారించారు. అక్కడ పులి అడుగులను గుర్తించారు. భూపాల్ నగర్, జాకారం, శ్రీనగర్, రామచంద్రాపురం వాసులు అడవుల్లోకి వెళ్లవద్దని హెచ్చరించారు.