News December 22, 2025
క్రిస్మస్కు ఒంగోలు మీదుగా స్పెషల్ ట్రైన్..!

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలుమీదుగా వేళాంగిణికి ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సోమవారం విడుదల చేసింది. సికింద్రాబాదు నుంచి వేళాంగిణికి స్పెషల్ ట్రైన్ (07407) చీరాల, ఒంగోలు మీదుగా 23వ తేదీన ప్రయాణిస్తుందన్నారు. అలాగే వేళాంగిణి నుంచి సికింద్రాబాదుకు (07408) స్పెషల్ ట్రైన్ 25వ తేదీన ఒంగోలు మీదుగా ప్రయాణిస్తుందన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.
Similar News
News December 26, 2025
ప్రకాశం: పొట్టకూటి కోసం వెళ్లి.. కామారెడ్డిలో ఆత్మహత్య!

పొట్టకూటి కోసం కామారెడ్డికి వెళ్లిన ప్రకాశం జిల్లా వాసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన శుక్రవారం జరిగింది. ప్రకాశం జిల్లాకు చెందిన తమ్మిశెట్టి కన్నయ్య (63) కామారెడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో దేవగిరి ఎక్స్ప్రెస్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. 30 ఏళ్లుగా కామారెడ్డిలో కన్నయ్య జీవనం సాగిస్తున్నట్లు సమాచారం.
News December 26, 2025
ప్రకాశం జిల్లాలో TDP మొదలెట్టింది.. జనసేన ఎప్పుడో..?

ప్రకాశం జిల్లాలో TDP జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే TDPకి బూత్, గ్రామ స్థాయి కమిటీలు ఉన్నాయి. అయితే జనసేన అదే తరహా కమిటీలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇదే విషయాన్ని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ పదవీ బాధ్యత కార్యక్రమంలో ప్రకటించారు. కాగా జిల్లా జనసేన అధ్యక్షుడు రియాజ్ సారథ్యంలో బూత్, గ్రామ కమిటీల నియామకం ఎప్పుడు జరుగుతుందన్నదే ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది.
News December 26, 2025
ప్రకాశం జిల్లాలో TDP మొదలెట్టింది.. జనసేన ఎప్పుడో..?

ప్రకాశం జిల్లాలో TDP జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే TDPకి బూత్, గ్రామ స్థాయి కమిటీలు ఉన్నాయి. అయితే జనసేన అదే తరహా కమిటీలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇదే విషయాన్ని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ పదవీ బాధ్యత కార్యక్రమంలో ప్రకటించారు. కాగా జిల్లా జనసేన అధ్యక్షుడు రియాజ్ సారథ్యంలో బూత్, గ్రామ కమిటీల నియామకం ఎప్పుడు జరుగుతుందన్నదే ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది.


