News April 22, 2024
జాన్సన్ బేబీ పౌడర్తో మహిళకు క్యాన్సర్.. రూ.375 కోట్ల పరిహారం

ప్రఖ్యాత జాన్సన్& జాన్సన్, కెన్వ్యూ కంపెనీలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంస్థల బేబీ పౌడర్లు వాడటం వల్ల థెరిసా గార్సియా అనే మహిళ క్యాన్సర్తో చనిపోయినట్లు చికాగో కోర్టు తేల్చింది. ఆమె కుటుంబానికి రూ.375 కోట్లు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ‘ఆస్బెస్టాస్ ఎక్స్పోజర్తో ముడిపడిన క్యాన్సర్ మెసోథెలియోమాతో థెరిసా మరణించింది. దీనికి కెన్వ్యూ 70%, JJ 30% బాధ్యత వహించాలి’ అని స్పష్టం చేసింది.
Similar News
News March 12, 2026
The Hundred: పాక్ ప్లేయర్ను సన్రైజర్స్ కొనడంపై విమర్శలు!

ఇంగ్లండ్ టోర్నీ The Hundred వేలంలో పాక్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ను సన్ రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ₹2.34 కోట్లకు అతడిని దక్కించుకోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. సన్రైజర్స్ ఫ్రాంచైజీకి ఇది సిగ్గు చేటని ఫైరవుతున్నారు. ఇండియాను, ఆర్మీని ఎగతాళి చేసే వ్యక్తిని తీసుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. IPL అనుబంధ ఫ్రాంచైజీలు పాక్ ప్లేయర్లను అవైడ్ చేస్తాయని ఇటీవల వార్తలొచ్చాయి.
News March 12, 2026
రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు

TG: మండుతున్న ఎండలు, ఉక్కపోతకు ఉపశమనం కలిగించేలా రాష్ట్రంలో 2 రోజులు వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 15, 16 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మెదక్, హైదరాబాద్, మేడ్చల్, MBNR జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయని పేర్కొంది. అప్పటివరకు ఎండలు దంచి కొట్టనున్నాయని వెల్లడించింది.
News March 12, 2026
ఆయిల్ ధరలు పెరిగితే అమెరికాకే లాభం.. కానీ: ట్రంప్

క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే అమెరికాకే బెనిఫిట్ అని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు అని.. ధరలు పెరిగితే USకు భారీగా ఆదాయం వస్తుందన్నారు. కానీ అది తన ప్రాధాన్యం కాదన్నారు. న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకుండా, పశ్చిమాసియాతో పాటు ప్రపంచాన్ని నాశనం చేయకుండా ఇరాన్ను అడ్డుకోవడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.


