News December 22, 2025

ఫిర్యాదులపై సత్వర చర్యలు: సూర్యాపేట ఎస్పీ

image

బాధితులకు అండగా ఉంటూ ప్రజా సమస్యలను చట్టపరిధిలో వేగంగా పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ కె.నరసింహ భరోసా ఇచ్చారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’లో ఆయన పాల్గొని బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎస్పీ, ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News January 3, 2026

చిత్తూరు: రేషన్ సరకుల కోసం ఆందోళన.!

image

బియ్యం అందరికీ ఇచ్చేవరకు రేషన్ షాప్ తెరవొద్దని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పాలసముద్రం మండలం మణిపురం చౌకదుకాణం ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. ప్రతి నెలా 60 నుంచి 70 కార్డులకు బియ్యం అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలియజేశారు. సమాచారం అందుకున్న తహశీల్దార్ గుర్రప్ప నిరసనకారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

News January 3, 2026

ప్రకాశం జిల్లాలో 104 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

ప్రకాశం జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న 104 బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష APC అనిల్ కుమార్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒంగోలులోని సమగ్ర శిక్ష కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలన్నారు. పూర్తి వివరాలకు www.deoprakasam.co.in చూడాలని సూచించారు.

News January 3, 2026

భూ సమస్యలు లేకుండా చేయడమే లక్ష్యం: చంద్రబాబు

image

AP: రాజముద్రతో కొత్త పాసు పుస్తకాల పంపిణీ రైతులకు నూతన సంవత్సర కానుక అని CM చంద్రబాబు అన్నారు. భూమే ప్రాణంగా బతికే రైతులకు సమస్యలు లేకుండా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రజలకు భూ వివాదాలు లేకుండా చూడాలని, ఇదే ప్రథమ కర్తవ్యంగా పనిచేయాలని సూచించారు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా మంత్రులతో సమీక్షించారు. పాసు పుస్తకాల పంపిణీలో ఒకరోజు పాల్గొంటానని తెలిపారు.