News December 22, 2025
కోనసీమ SP కార్యాలయానికి 29 అర్జీలు

కోనసీమ జిల్లా SP కార్యాలయానికి ప్రజల నుంచి 29 అర్జీలు వచ్చినట్లు కార్యాలయం ఒక ప్రకటనలో సోమవారం తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందని ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. ప్రజల నుంచి కేసుల వివరాలను SP స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలు అర్జీల రూపంలో వచ్చినట్లు వెల్లడించారు.
Similar News
News December 26, 2025
రామచంద్రపురంలో విజిలెన్స్ కమిటీ సమీక్ష.. ఎస్సీ, ఎస్టీ కేసులపై ఆరా!

రామచంద్రపురంలో శుక్రవారం సబ్ డివిజనల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఆర్డీఓ అఖిల, డీఎస్పీ రఘువీర్ అధికారులతో కలిసి ఎస్సీ, ఎస్టీ కేసులు, వసతి గృహాల నిర్వహణ, ట్రాఫిక్ సమస్యలపై సమీక్షించారు. బాధితులకు న్యాయం చేయడంలో జాప్యం వహించరాదని, సమస్యల పరిష్కారానికి పక్కా ప్రణాళికలతో ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పట్ల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
News December 26, 2025
పీఆర్సీ ప్రకటించకపోతే మారో ఉద్యమం: UTF

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీని ప్రకటించి అమలు చేయాలని, లేనిపక్షంలో మరో ఉద్యమానికి సిద్ధమని యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం సిద్దిపేటలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2023 జూలై 1 నుంచి పీఆర్సీని వర్తింపజేయాలని, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 28, 29న జరిగే మహాసభలను ఉపాధ్యాయులందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
News December 26, 2025
శ్రీకాకుళం: పెరిగిన కోడి గుడ్డు ధర ఎంతంటే !

ఎన్నడూ లేని విధంగా కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. రూ.8 ఉన్న గుడ్డు ధర రూ.10కి చేరింది. హోల్సేల్ మార్కెట్లోనే ఒక్కో గుడ్డు రూ.9.30 పలుకుతోంది. ప్రస్తుతం ఒక ట్రే రూ.270 నుంచి రూ.290కి చేరింది. క్రిస్మస్, న్యూఇయర్ కారణంగా ఎగుమతులు పెరగటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు. ఎన్నడూ లేని విధంగా గుడ్ల ధరలు రికార్డు స్థాయికి చేరడంతో వినియోగదారులు ఆందోళన పడుతున్నారు.


