News December 22, 2025
తూ.గో. ఎస్పీ నరసింహ కిషోర్కు DGP బ్రాంజ్ డిస్క్ అవార్డు

తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ DGP బ్రాంజ్ డిస్క్ అవార్డును దక్కించుకున్నారు. డీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారుల సేవలను గుర్తించి సిల్వర్, బ్రోన్జ్ డిస్క్ అవార్డులను ప్రకటించారు. అందులో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, కడియం ఎస్సై బి.నాగ దుర్గాప్రసాద్, సిబ్బందికి ఈ అవార్డులను ప్రకటించారు. ఈ సందర్భంగా ఎస్పీకి పోలీసు అధికారులు సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.
Similar News
News January 2, 2026
వంతెనపై బైక్.. గోదావరిలో శవమై తేలిన వేములూరు వాసి!

ఐదు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ విషాదాంతమైంది. కొవ్వూరు మండలం వేములూరుకు చెందిన గేల్లా గోవిందప్రసాద్(38) మృతదేహం గోదావరి నదిలో లభ్యమైంది. డిసెంబరు 30న ఇంటి నుంచి వెళ్లిన ఆయన.. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 31న రోడ్డు కం రైలు వంతెనపై బైకును గుర్తించిన పోలీసులు గాలింపు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News January 2, 2026
తూర్పు గోదావరిలో వరి సేకరణ వేగవంతం: జేసీ

తూర్పు గోదావరి జిల్లాలో ఖరీఫ్ వరి సేకరణ ప్రక్రియ విజయవంతంగా సాగుతోందని జేసీ వై. మేఘా స్వరూప్ గురువారం తెలిపారు. జనవరి 1, 2026 నాటికి పీపీసీల ద్వారా 3.67 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 47,426 మంది రైతులు ధాన్యం విక్రయించారు. ఈ సీజన్లో 4 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని జేసీ అన్నారు.
News January 2, 2026
తూర్పు గోదావరిలో వరి సేకరణ వేగవంతం: జేసీ

తూర్పు గోదావరి జిల్లాలో ఖరీఫ్ వరి సేకరణ ప్రక్రియ విజయవంతంగా సాగుతోందని జేసీ వై. మేఘా స్వరూప్ గురువారం తెలిపారు. జనవరి 1, 2026 నాటికి పీపీసీల ద్వారా 3.67 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 47,426 మంది రైతులు ధాన్యం విక్రయించారు. ఈ సీజన్లో 4 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని జేసీ అన్నారు.


