News April 22, 2024

అభ్యర్థుల ప్రకటన ఇంకెప్పుడు?

image

TG: లోక్‌సభ నామినేషన్ల గడువు 25న ముగియనుంది. ఇప్పటికే BRS, BJP అభ్యర్థులను ప్రకటించి ప్రచారం చేస్తున్నాయి. కానీ అధికార కాంగ్రెస్ మాత్రం మరో 3 స్థానాల్లో క్యాండిడేట్లను ప్రకటించాల్సి ఉంది. HYD, ఖమ్మం, కరీంనగర్ అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. పలుమార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లొచ్చినా ఈ ప్రక్రియ కొలిక్కి రాలేదు. దీంతో అభ్యర్థి ఎవరో తెలియకుండా ప్రచారమెలా చేయాలని కార్యకర్తలు అంటున్నారు.

Similar News

News February 3, 2026

అందుకే ట్రంప్ మొదట అనౌన్స్ చేశారు: గోయల్

image

ట్రేడ్ డీల్ గురించి US అధ్యక్షుడు ట్రంప్ ముందే ప్రకటించడంపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్న వేళ మంత్రి గోయల్ క్లారిటీ ఇచ్చారు. టారిఫ్స్ తగ్గించినట్లు మొదట అమెరికానే ప్రకటించిందని అందుకే ట్రంప్ మాట్లాడారని వివరించారు. టారిఫ్స్ విధించినప్పుడు ప్రకటన చేసినట్టే ఇప్పుడు కూడా ట్రంప్ చెప్పారని అన్నారు. కాగా ట్రంప్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఏకపక్షంగా నిర్ణయాలు ప్రకటిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి.

News February 3, 2026

రాహుల్ దేశాన్ని తప్పుదోవపట్టిస్తున్నారు: గోయల్

image

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరిని అనుసరిస్తున్నారని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. రాహుల్ లాంటి నెగటివ్ ఆలోచనలు కలిగిన వ్యక్తులు దేశాన్ని తప్పుదోవపట్టిస్తున్నారని మండిపడ్డారు. దేశ పురోగతి గురించి వారికి పట్టింపు లేదన్నారు. రాహుల్ సహా విపక్ష ఎంపీలు పార్లమెంటులో స్పీకర్ పట్ల అవమానకరంగా ప్రవర్తించారన్నారు. అందుకే పార్లమెంటులో మాట్లాడాల్సిన విషయం ఇక్కడ చెప్పాల్సి వచ్చిందన్నారు.

News February 3, 2026

జనసేన ఎమ్మెల్యేపై కేసు నమోదు

image

AP: మహిళపై <<18974672>>లైంగిక వేధింపుల ఆరోపణలు<<>> ఎదుర్కొంటున్న రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై కేసు నమోదైంది. NHRC ఆదేశాలతో ఎస్పీ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఈ వ్యవహారంపై ఇవాళ జనసేన త్రిసభ్య కమిటీ ఆయనను <<19038842>>విచారణ<<>> చేసిన విషయం తెలిసిందే.