News April 22, 2024
బేస్తవారిపేట: పెళ్లికి హాజరై తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదం

బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను వెనక నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 12 మందికి తీవ్ర గాయాలు కాగా కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య చికిత్స మార్కాపురం తరలించారు. గిద్దలూరు మండలంలో పెళ్లికి హాజరై తిరిగి మార్కాపురానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.
Similar News
News March 17, 2026
దోర్నాల: పులులు సంచరించే ప్రదేశం.. జాగ్రత్త

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాల సందర్భంగా దోర్నాల–శ్రీశైలం రహదారిలో ఈ నెల 20వ వరకు రాత్రి వేళల్లోనూ వాహన రాకపోకలకు అటవీశాఖ అధికారులు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మార్గం పులుల అభయారణ్యం గుండా వెళ్లడంతో, రాత్రి సమయంలో పులులు సహా, అడవి జంతువులు రోడ్డు దాటే అవకాశం ఎక్కువగా ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వేగం తగ్గించి జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
News March 17, 2026
దోర్నాల: పులులు సంచరించే ప్రదేశం.. జాగ్రత్త

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాల సందర్భంగా దోర్నాల–శ్రీశైలం రహదారిలో ఈ నెల 20వ వరకు రాత్రి వేళల్లోనూ వాహన రాకపోకలకు అటవీశాఖ అధికారులు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మార్గం పులుల అభయారణ్యం గుండా వెళ్లడంతో, రాత్రి సమయంలో పులులు సహా, అడవి జంతువులు రోడ్డు దాటే అవకాశం ఎక్కువగా ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వేగం తగ్గించి జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
News March 17, 2026
ప్రకాశం: బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు

10 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి ఒంగోలు పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. బేస్తవారిపేట(M) పూసలపాడుకు చెందిన మోతుకూరి కోలా పిచ్చయ్య(31)పై కేసు నమోదై దర్యాప్తు దర్వాప్తు నేరం రుజువైంది. ఈ సందర్భంగా బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించినట్లు SP తెలిపారు. ముద్దాయికి శిక్ష పడడంలో కృషి చేసిన పోలీసులను SP అభినందించారు.


