News December 23, 2025
కడప: ‘విద్యుత్ సమస్యలకు సత్వర పరిష్కారం’

నిరంతరాయంగా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. సోమవారం తన ఛాంబర్లో కరంటోళ్ల జనబాట”కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. విద్యుత్ సమస్యలపై ప్రజలకు వెంటనే పరిష్కారం అందించేందుకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన “కరంటోళ్ల జనబాట” అనే వినూత్న కార్యక్రమం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 29, 2025
కడప: 2025లో రైతులకు కష్టాలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు

మరో 2 రోజుల్లో 2025కు వీడ్కోలు చెప్పి 2026కు ఆహ్వానం పలుకుతాం.. అయితే ఈ ఏడాది మిర్చి, ఉల్లి పంటలకు సరైన గిట్టుబాటు ధరలేక జిల్లా రైతులు ఇబ్బందులు పడ్డారు. అంతే కాకుండా అకాల వర్షాలతో రైతన్నను మరింత ఊబిలోకి దింపింది. ఈ ఏడాది ఉమ్మడి కడప జిల్లా నుంచి 680 మంది టీచర్లుగా.. 323 మంది కానిస్టేబుళ్లుగా ఎంపిక కావడంతో వారి కుటుంబసభ్యులు సంతోషంగా ఉన్నారు. మరి ఈ ఏడాది సంతోషపెట్టిన, బాధపెట్టిన విషయాలేంటో కామెంట్.
News December 29, 2025
ఒంటిమిట్ట: వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం

ఒంటిమిట్ట శ్రీకోదండ రామస్వామి ఆలయంలో ఈ నెల 30న జరగబోయే వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు పూర్తి అయినట్లు ఆదివారం TTD ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉత్తర ద్వారా దర్శనానికి వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు, చంటి బిడ్డల తల్లులు, వయోవృద్ధుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనట్లు TTD AE అమర్నాథ్ రెడ్డి తెలిపారు. ఆరోజు భక్తులకు ప్రసాదం, అన్న ప్రసాదం అందుబాటులో ఉంటుందని TTD DEO ప్రశాంతి తెలియజేశారు.
News December 29, 2025
పుష్పగిరిలో ఒకే పలకపై త్రిమూర్తుల అరుదైన కుడ్య శిల్పం

వల్లూరు(M) పుష్పగిరి క్షేత్రం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ గోడపై ఒకే పలకపై త్రిమూర్తుల అరుదైన కుడ్య శిల్పం అద్భుతంగా ఉందని రచయిత చరిత్రకారుడు బొమ్మి శెట్టి రమేశ్ ఆదివారం తెలిపారు. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు సృష్టి పాలకుడు, పరమేశ్వరుడు సృష్టి లయ కారకుడన్నారు. త్రిమూర్తులు ఒకే పరబ్రహ్మం మూడు రూపాలు అని చెప్పారు.


