News December 23, 2025

కోటి రూపాయల మోసం.. పంజాగుట్టలో కేసు నమోదు

image

బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్ వద్ద కోటి రూపాయల మోసం జరిగింది. క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో అత్తాపూర్‌కు చెందిన వ్యక్తిని నమ్మించి కోటికి పైగా నగదు దోచుకున్నారు. లాభాలు ఇప్పిస్తామని చెప్పి హోటల్ పార్కింగ్‌లో నగదు తీసుకొని కేటుగాడు పరారయ్యాడు. బాధితులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News December 25, 2025

హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్..

image

HYDలో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్‌కి చేరింది. చలికాలం పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతోంది. డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ గురువారం తెల్లవారుజామున 240కి చేరింది. శ్వాసకోస వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలు అని డాక్టర్లు సూచిస్తున్నారు. తెల్లాపూర్ ఏరియాలో 422గా నమోదు అయింది.
SHARE IT

News December 25, 2025

హైదరాబాద్‌లో Christmas Vibes

image

హైదరాబాద్‌లో క్రిస్మస్ జోష్ మరో లెవల్‌లో ఉంది. గతేడాది కంటే జనం తాకిడి 15% పెరిగిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. కొన్ని చర్చిల్లో ‘రీసైకిల్డ్ ట్రీ’తో ఎన్విరాన్మెంట్ మెసేజ్ ఇస్తున్నారు. ఇక సికింద్రాబాద్ మేరీస్ చర్చి దగ్గరైతే ఎటు చూసినా వెలుగులే. లాలాగూడలో మన ఆంగ్లో-ఇండియన్స్ పాతకాలం నాటి ‘లిటిల్ ఇంగ్లాండ్’ని కళ్ల ముందు ఉంచారు. యువత ‘క్రిస్మస్ హగ్’ సిటీకి కొత్త అందాన్ని తెచ్చింది.Mery Christmas

News December 25, 2025

హైదరాబాద్‌లో Christmas Vibes

image

హైదరాబాద్‌లో క్రిస్మస్ జోష్ మరో లెవల్‌లో ఉంది. గతేడాది కంటే జనం తాకిడి 15% పెరిగిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. కొన్ని చర్చిల్లో ‘రీసైకిల్డ్ ట్రీ’తో ఎన్విరాన్మెంట్ మెసేజ్ ఇస్తున్నారు. ఇక సికింద్రాబాద్ మేరీస్ చర్చి దగ్గరైతే ఎటు చూసినా వెలుగులే. లాలాగూడలో మన ఆంగ్లో-ఇండియన్స్ పాతకాలం నాటి ‘లిటిల్ ఇంగ్లాండ్’ని కళ్ల ముందు ఉంచారు. యువత ‘క్రిస్మస్ హగ్’ సిటీకి కొత్త అందాన్ని తెచ్చింది.Mery Christmas