News December 23, 2025

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ‘ముస్తాబు’

image

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ముస్తాబు కార్యక్రమం పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. వసతి గృహాలు, ముస్తబు కార్యక్రమ అమలుపై సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో మిడ్ డే మీల్స్‌ను మండల ప్రత్యేక అధికారులు తనిఖీ చేయాలని ఆయన సూచించారు. డీఈఓ రాజేంద్రప్రసాద్, సర్వ శిక్ష అభియాన్ పీవో వెంకట రమణ పాల్గొన్నారు.

Similar News

News January 16, 2026

CTR: మామిడి రైతులకు బకాయిలు అందేనా.?

image

మామిడి రైతులకు పల్ప్ ఫ్యాక్టరీలు అందించాల్సిన బకాయిలు ఇంతవరకు అందకపోవడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో సీజన్ ప్రారంభానికి సిద్ధమైనా ఇంతవరకు ఫ్యాక్టరీలు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించడం లేదు. రూ.50 కోట్ల వరకు బకాయిలు రైతులకు ఫ్యాక్టరీలు అందించాల్సి ఉంది. గత సీజన్లో ప్రభుత్వం కిలో తోతాపూరికి రూ.4 రాయితీ చెల్లించగా.. ఫ్యాక్టరీలు రూ.8 చెల్లించాలని ఆదేశించింది.

News January 16, 2026

చిత్తూరులో జనాభా లెక్కలు ఎప్పటి నుంచో తెలుసా?

image

చిత్తూరు జిల్లాలో జన గణననకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నారు. కలెక్టర్ ఇటీవల సమావేశం ఏర్పాటు చేసి తాను ముఖ్య జన గణన అధికారిగా ఉంటానని వెల్లడించారు. ఇతర శాఖ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. జిల్లాలో సుమారు ఆరు లక్షల గృహాలు ఉండగా.. 2011 లెక్కల ప్రకారం18 లక్షల మంది జనాభా ఉన్నారు. ప్రత్యేక యాప్ ద్వారా ఏప్రిల్ ఒకటి నుంచి జన గణన చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

News January 16, 2026

చిత్తూరు: అసభ్యకర పోస్టులపై విచారణ

image

సమాచార శాఖ.కుప్పం అధికారిక వాట్సాప్ గ్రూపులో <<18869391>>అసభ్యకర వీడియోలు <<>>కలకలం రేపాయి. ఇదే అంశంపై Way2Newsలో ప్రచురితమైన వార్తకు పోలీసులు స్పందించారు. చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలతో విచారణ చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గ ప్రింట్ &ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో పాటు కుప్పం RDO, I&PR అధికారులు ఉన్న గ్రూపులో గురువారం సాయంత్రం అసభ్యకరమైన పోస్టులు షేర్ చేయగా నిమిషాల వ్యవధిలో ఆ అధికారి డిలీట్ చేశారు.