News April 22, 2024

మదనపల్లె: పెద్దిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు

image

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందీశ్వరిని చిన్నపాటి రాక్షసి అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ ఎత్తివేస్తామని మాట్లాడారని ఆరోపించారు. అలాగే రాజంపేట ఎన్డీఏ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి వలన రాష్ట్రం రెండుగా విడిపోయిందని, సీఎంగా చేసిన కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయిందని అన్నారు.

Similar News

News March 10, 2026

చిత్తూరు: KGBVల్లో ప్రవేశానికి దరఖాస్తులు

image

చిత్తూరు జిల్లాలోని 7 KGBV బాలికల విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో 40 సీట్లు, 7 నుంచి ఇంటర్ వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈనెల 12 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్రశిక్ష APC వెంకటరమణ తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వీలుందన్నారు. ఏప్రిల్ 13-17 వరకు అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందన్నారు. ఇతర వివరాలకు KGBVలోని ప్రిన్సిపల్స్‌ను సంప్రదించాలన్నారు.

News March 10, 2026

చల్లా బాబును దూరం పెడుతున్న అధినేత..?

image

చల్లా బాబును పుంగనూరు నియోజకవర్గ TDP ఇన్‌ఛార్జ్ పదవి నుంచి తొలగించనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందుకు అధిష్ఠానం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నా, త్రిసభ్య కమిటీ వేసి, పెద్దిరెడ్డిని సమర్థవంతంగా ఎదుర్కొనే నాయకుడి కోసం ప్రయత్నాలు చేయనున్నట్లు సమాచారం. సరైన నేత ఉంటే 2029 ఎన్నికల్లో పెద్దిరెడ్డిని ఓడించడం ఖాయమని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారట.

News March 10, 2026

125 రోజుల పని దినాల పోస్టర్ ఆవిష్కరణ

image

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న VB-G రామ్ జీ చట్టం పరిధిలో 125 రోజుల పనిదినాల లక్ష్యంతో రూపొందించిన ప్రత్యేక పోస్టర్‌ను సోమవారం కలెక్టర్ సుమిత్ కుమార్ కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. గ్రామీణ కార్మికులకు స్థిరమైన ఉపాధి కల్పన, గ్రామాల అభివృద్ధికి తోడ్పడడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. 125 రోజుల పనిదినాల అమలుతో గ్రామీణ కుటుంబాలకు మరింత ఆదాయం లభించే అవకాశం ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.