News December 23, 2025
నేడు నల్గొండకు KTR

ఉద్యమాల గడ్డ నల్గొండ జిల్లా కేంద్రానికి మంగళవారం మాజీ మంత్రి, BRS పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ KTR రానున్నారు. నల్గొండ జిల్లాలో BRS పార్టీ బలపరిచి గెలుపొందిన గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లను కలిసి KTR అభినందిస్తారని పార్టీ శ్రేణులు తెలిపాయి. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం వద్దకు సమయానికి హాజరుకావాలని కార్యకర్తలకు నేతలు పిలుపునిచ్చారు.
Similar News
News December 28, 2025
భారత్ ఖాతాలో మరో విజయం

శ్రీలంక ఉమెన్స్తో జరుగుతున్న 5 T20ల సిరీస్లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. తాజాగా జరిగిన 4వ T20లో IND 30 రన్స్ తేడాతో గెలిచింది. 222 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన SL 20 ఓవర్లలో 191/6 రన్స్కే పరిమితమైంది. ఓపెనర్లు ఆటపట్టు(52), పెరెరా(33) దూకుడుగా ఆడినా వారు ఔటయ్యాక రన్రేట్ పెరిగిపోవడంతో ఓటమిపాలైంది. IND బౌలర్లలో అరుంధతి, వైష్ణవి చెరో 2 వికెట్లు తీశారు. సిరీస్లో IND 4-0 లీడ్ సాధించింది.
News December 28, 2025
బ్యాడ్మింటన్లో గోల్డ్ సాధించిన చరిష్మ.. CBN, లోకేశ్ అభినందనలు

AP: విజయవాడలో జరిగిన 87వ యోనెక్స్ సన్రైజ్ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్-2025 ఉమెన్స్ సింగిల్స్లో రాష్ట్రానికి చెందిన సూర్య చరిష్మ తమిరి గోల్డ్ మెడల్ సాధించారు. అలాగే ఇంటర్ స్టేట్ ఇంటర్ జోనల్ బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్ షిప్లో ఆంధ్రా జట్టు సిల్వర్ గెలిచింది. తొలి గోల్డ్ మెడల్ సాధించిన చరిష్మ, సిల్వర్ గెలిచిన టీమ్ను CM చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ అభినందించారు.
News December 28, 2025
29న పుట్టపర్తిలో రెవెన్యూ క్లినిక్ ప్రారంభం

పుట్టపర్తిలో ఈనెల 29న ‘రెవెన్యూ క్లినిక్’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. సులభంగా, వేగవంతంగా రెవెన్యూ సేవలు అందించడమే లక్ష్యమన్నారు. అడంగల్ సవరణలు, మ్యుటేషన్, 1బి, పట్టాదారు పాస్పుస్తకాలు, అసైన్మెంట్, 22ఏ, భూ సమస్యల పరిష్కారానికి డివిజన్ వారీగా కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రైతులకు జనవరి 2 నుంచి 9 వరకు కొత్త పాసుపుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు.


