News December 23, 2025
సైనికుల సంక్షేమానికి మెప్మా నుంచి రూ.4 లక్షల విరాళం

సైనికుల సంక్షేమానికి శ్రీ సత్యసాయి జిల్లా మెప్మా శాఖ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలు రూ.4 లక్షల విరాళాన్ని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్కు అందజేశారు. సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని PGRS హాలులో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ.పద్మావతి, అర్బన్ జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు విజయలక్ష్మి, జిల్లా సమాఖ్య సెక్రటరీ పద్మావతి, మెప్మా సీఎంఎం కలిసి సైనికుల సంక్షేమ నిధికి సంబంధించిన చెక్కును అందజేశారు.
Similar News
News December 27, 2025
గాంధీ చిత్ర పటాలతో గ్రామ గ్రామాన నిరసన: మంత్రి దామోదర

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మంత్రి దామోదర రాజనరసింహ విమర్శించారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా గ్రామ గ్రామాన ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంత పేదలకు భరోసాగా ఉన్న ఈ పథకాన్ని కాపాడుకుంటామని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.
News December 27, 2025
పలమనేరు, పీలేరు, మదనపల్లె రెవెన్యూ డివిజన్లో మార్పులు!

జిల్లాల పునర్విభజనపై CM చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో చిత్తూరు జిల్లా పరిధిలో చేపట్టనున్న మార్పులను కొనసాగించాలని నిర్ణయించారు. పలమనేరు రెవెన్యూ డివిజన్లోని బంగారుపాలెంను చిత్తూరు డివిజన్కు, చౌడేపల్లి, పుంగనూరు మండలాలను మదనపల్లి రెవెన్యూ డివిజన్కు బదిలీ చేయడం, సదుం, సోమల మండలాలను మదనపల్లి జిల్లాలోని పీలేరు రెవెన్యూ డివిజన్లో విలీనం చేయాలని తేల్చారు. డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ జారీ కానుంది.
News December 27, 2025
SKLM: నెలవారీ నేర సమీక్షలో ఎస్పీ సూచనలు

న్యూఇయర్, సంక్రాంతి, రథసప్తమి వేడుకలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. నెలవారీ నేర సమీక్ష సమావేశంలో భాగంగా శనివారం రాత్రి శ్రీకాకుళంలో పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ముందుగా జిల్లాలో నేరాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతలు పరిరక్షణలో ముందుండాలని అధికారులకు సూచించారు.


