News December 23, 2025
FLASH: డ్రంక్ అండ్ డ్రైవ్ రిపోర్ట్ విడుదల..!

HYD ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల రిపోర్ట్ విడుదల చేశారు. HYD పోలీసుల నివేదిక ప్రకారం.. డిసెంబర్ 15 నుంచి 21 మధ్య 1,102 కేసులు నమోదయ్యాయి. ఇందులో ద్విచక్ర వాహనదారులే ఎక్కువ. 21–40 ఏళ్ల యువత అధికంగా పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది. మద్యం డ్రైవింగ్ ప్రమాదాలకు, ప్రాణ నష్టాలకు కారణమవుతోందన్నారు.
Similar News
News December 28, 2025
మరో అడ్వెంచర్.. సబ్మెరైన్లో ప్రయాణించనున్న రాష్ట్రపతి

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మరో అడ్వెంచర్కు సిద్ధమవుతున్నారు. కర్ణాటకలోని కార్వార్ హార్బర్ నుంచి రేపు సబ్మెరైన్లో ప్రయాణించనున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం తర్వాత జలాంతర్గామిలో వెళ్లనున్న రెండో రాష్ట్రపతిగా ముర్ము నిలవనున్నారు. 2006లో విశాఖపట్నం నుంచి సబ్మెరైన్లో కలాం ప్రయాణించారు. కాగా గత అక్టోబర్లో <<18139196>>రఫేల్ జెట్<<>>లో, 2023లో Sukhoi 30 MKI యుద్ధ విమానంలో ముర్ము విహరించడం తెలిసిందే.
News December 28, 2025
ప్రకృతి సేద్యంలో దూసుకెళ్తున్న మహిళలు

ప్రకృతి వ్యవసాయంతో మంచి దిగుబడి, ఆదాయం పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు తిరుపతి జిల్లా తొట్టంబేడు(M) పెద్దకనపర్తికి చెందిన పద్మావతి, భ్రమరాంబ. వీరు సేంద్రియ సేద్యంలో వరి, పసుపు, కూరగాయలు, ఇతర పంటలు పండిస్తున్నారు. ఇంటి వద్దే ఘన, ద్రవ జీవామృతం, పంచగవ్య ఇతర ద్రావణాలు తయారుచేసి పంటకు అందించి మంచి దిగుబడులు పొందుతున్నారు. సేద్యంలో ఈ మహిళలు ఎలా రాణిస్తున్నారో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 28, 2025
భీమిలికి పెరుగుతున్న వలసలు

భీమిలిలో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని ప్రభుత్వం చెబుతుంటే.. వలస పక్షులు వాలుతున్నాయి. ఇంతకాలం పిల్లల చదువుల కోసం స్టీల్ సిటీకి వచ్చేవారు. ఇప్పుడు ఉపాధి పెరుగుతుండడంతో వలసలు మొదలయ్యాయి. ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, ఐటీ పురోగతి పెరగడంతో మైగ్రేషన్ పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో మొదటి రెండు స్థానాల్లో భీమిలి, గాజువాక నిలిచాయి.


