News December 23, 2025

వీరఘట్టం: విద్యుత్ స్తంభాలను ఢీ కొన్న బైక్.. ఇద్దరికి తీవ్ర గాయాలు

image

వీరఘట్టం మండలం కడకెల్ల వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల తెలిపిన సమాచారం మేరకు.. ఖడ్గవలస నుంచి బులెట్ బైక్‌పై వీరఘట్టంకు చెందిన బంగారం వ్యాపారి కోణార్క్ శ్రీను మరో వ్యక్తితో కలిసి వస్తుంగా కడకెల్ల వద్ద రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని వైద్యం కోసం పార్వతీపురం తరలించారు.

Similar News

News December 25, 2025

GNT: ORR కోసం భూసేకరణకు ప్రభుత్వం రెడీ.!

image

అమరావతి ORR కోసం భూసేకరణకు ప్రభుత్వం రెడీ అయింది. కేంద్రం ఇప్పటివరకు గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఏలూరు జిల్లాలకు గెజిట్ విడుదల చేసింది. 4 జిల్లాలో మొత్తం 189.90 Km మేర ORR నిర్మించనున్నారు. గుంటూరు జిల్లాలో 67.65Km, పల్నాడులో 17.23Km మేర నిర్మించనున్నారు. ORR ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించేలోపు భూసేకరణను కొలిక్కి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

News December 25, 2025

DGP ఎంపికపై కీలక ఆదేశాలు

image

TG: తాత్కాలిక పద్ధతిలో రాష్ట్ర DGPగా శివధర్ రెడ్డి నియామకం చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన నియామక ఉత్తర్వుల రద్దుకు నిరాకరించింది. అయితే DGP ఎంపిక ప్రక్రియను కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించింది. ఇందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేసింది. సీనియర్ ఐపీఎస్‌ల జాబితాను UPSCకి పంపించిన తర్వాత ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

News December 25, 2025

హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్..

image

HYDలో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్‌కి చేరింది. చలికాలం పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతోంది. డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ గురువారం తెల్లవారుజామున 240కి చేరింది. శ్వాసకోస వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలు అని డాక్టర్లు సూచిస్తున్నారు. తెల్లాపూర్ ఏరియాలో 422గా నమోదు కావటం గమనర్హం.

SHARE IT