News December 23, 2025

తూ.గో: 500 అడిగి.. ఆత్మహత్య చేసుకున్నాడు..!

image

అమలాపురం మెట్ల కాలనీలో దీపక్‌రాజ్‌(18) సోమవారం <<18637820>>ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే<<>>. చెడు వ్యసనాలకు బానిసైన అతడు ఆదివారం రాత్రి మద్యం కోసం తల్లిని రూ.500 అడిగాడు. ఆమె డబ్బులు పంపడంతో మద్యం తాగి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. అనంతరం ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Similar News

News January 10, 2026

రూ.3వేల కోట్ల విలువైన భూములను కాపాడిన హైడ్రా

image

TG: హైదరాబాద్‌లోని మియాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. మక్తా మహబూబ్ పేటలో 15 ఎకరాల ప్రభుత్వ భూములను కాపాడింది. భూఆక్రమణల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా అక్రమ నిర్మాణాలను తొలగించి తాజాగా హద్దులను నిర్ణయించి ఫెన్సింగ్ వేసింది. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది. ఈ భూముల విలువ ₹3వేల కోట్లు ఉంటుందని పేర్కొంది. తప్పుడు సర్వే నంబర్లతో కబ్జాకు పాల్పడిన ఇమ్రాన్‌పై కేసు నమోదైంది.

News January 10, 2026

కృష్ణా: కోళ్లు కాదు.. కోట్లు చేతులు మారబోతున్నాయి..!

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో సంక్రాంతి జూదం పరాకాష్టకు చేరింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీగా బరులు సిద్ధం కాగా, పందేల రూపంలో కోట్ల రూపాయల నగదు చేతులు మారనుంది. పది పందేలు గెలిస్తే కార్లు, బుల్లెట్ బైకులు బహుమతులుగా ప్రకటిస్తూ పందెగాళ్లను ఆకర్షిస్తున్నారు. సరదా పేరుతో మొదలయ్యే ఈ వ్యసనం వల్ల సామాన్యుల జీవితాలు రోడ్డున పడే ప్రమాదముందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News January 10, 2026

మంత్రి అనిత- సీనియర్ల మధ్య గ్యాప్?

image

అనకాపల్లి జిల్లాలో సీనియర్ MLAలు, మాజీ మంత్రులతో హోంమంత్రి అనిత అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ‌ఆమె కార్యక్రమాల్లో సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ప్రొటోకాల్ పరమైన పిలుపులు తప్ప ఆత్మీయ ఆహ్వానాలు లేవని కూటమి వర్గాలు చర్చించుకుంటున్నాయి. తాజాగా అడ్డురోడ్డు ఆర్డీవో కార్యాలయ ప్రారంభోత్సవానికి పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం ఈ అసంతృప్తికి నిదర్శనమంటున్నారు.