News April 22, 2024

శ్రీకాకుళం: నేడు నామినేషన్లు వేసేది వీరే..!

image

శ్రీకాకుళం జిల్లాలో నేడు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పలాస నుంచి మంత్రి సీదిరి అప్పలరాజు, పాతపట్నం నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెడ్డిశాంతితో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలిలో నామినేషన్ చేయనున్నారు. వీరితో పాటు తమ్మినేని సీతారాం ఆమదాలవలసలో నామినేషన్ వేయనున్నారు.

Similar News

News March 13, 2026

SKLM: రైల్వే రిక్రూట్మెంట్ గ్రూప్ డి పరీక్షలకు ఉచిత శిక్షణ

image

రైల్వే రిక్రూట్ మెంట్ గ్రూప్ డి – 2026 పరీక్షలకు ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థులు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా BC సంక్షేమ అధికారి ఎపీ బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు ఇ. అనూరాధ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను మార్చి 23వ తేదీలోగా ఎ.సి.బి.సి.స్టడీ సర్కిల్, శ్రీకాకుళంకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందన్నారు. 100 మంది అభ్యర్ధులకు 2 నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు.

News March 13, 2026

SKLM: రైల్వే రిక్రూట్మెంట్ గ్రూప్ డి పరీక్షలకు ఉచిత శిక్షణ

image

రైల్వే రిక్రూట్ మెంట్ గ్రూప్ డి – 2026 పరీక్షలకు ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థులు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా BC సంక్షేమ అధికారి ఎపీ బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు ఇ. అనూరాధ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను మార్చి 23వ తేదీలోగా ఎ.సి.బి.సి.స్టడీ సర్కిల్, శ్రీకాకుళంకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందన్నారు. 100 మంది అభ్యర్ధులకు 2 నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు.

News March 12, 2026

శ్రీకాకుళం: 24 మంది గ్రేడ్-2 వీఆర్వోలకు గ్రేడ్-1 పదోన్నతి

image

శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తున్న 24 మంది గ్రేడ్ వీఆర్వోలకు గ్రేడ్ వన్ వీఆర్వోలుగా పదోన్నతి లభించింది. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీరికి కౌన్సిలింగ్ నిర్వహించి స్థానాలను కేటాయించారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యకు పరిష్కార మార్గం చూపిన కలెక్టర్‌కు, జాయింట్ కలెక్టర్‌లకు వీఆర్వోల సంఘ ప్రతినిధులు రాజేష్, అప్పలనాయుడు, రాంజీ ఇతర ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు.