News April 22, 2024

ఉమ్మడి విశాఖలో నేడు నామినేషన్లు వేసేది వీరే

image

➤ ఎం.శ్రీభరత్(టీడీపీ): విశాఖ ఎంపీ
➤ వంగలపూడి అనిత(టీడీపీ), కంబాల జోగులు(వైసీపీ): పాయకరావుపేట ఎమ్మెల్యే
➤ బండారు సత్యనారయణ(టీడీపీ): మాడుగుల ఎమ్మెల్యే
➤ బూడి ముత్యాలనాయుడు: అనకాపల్లి ఎంపీ
➤ గిడ్డి ఈశ్వరి(టీడీపీ): పాడేరు ఎమ్మెల్యే
➤ కొత్తపల్లి గీత(బీజేపీ): అరకు ఎంపీ
➤ రేగం మత్స్యలింగం(వైసీపీ): అరకు ఎమ్మెల్యే
➤➤ వీరితో పాటు మరికొంతమంది స్వతంత్ర అభ్యర్థులు ఈరోజు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

Similar News

News March 18, 2026

దివ్యాంగ చిన్నారులతో విశాఖ కలెక్టర్ ఆత్మీయ విందు

image

విశాఖలోని వివిధ వసతి గృహాలకు చెందిన దివ్యాంగ చిన్నారులతో కలిసి కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆత్మీయ విందు నిర్వహించారు. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఈ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ చిన్నారులతో కలిసి భోజనం చేస్తూ వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నారు.

News March 18, 2026

భవానిపట్నం ప్యాసింజర్ (58504) రైలు రీ షెడ్యూలు

image

విశాఖపట్నం నుంచి బయల్దేరాల్సిన భవానిపట్నం ప్యాసింజర్ (58504) రైలు బుధవారం రీ షెడ్యూలు అయింది. విశాఖ నుంచి సాయంత్రం 6 గంటలకు బయల్దేరాల్సిన ఈ రైలు సాయంత్రం 7 గంటలకు బయలుదేరేలా మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సాంకేతిక కారణాల నేపథ్యంలో రీ షెడ్యూలు జరిగినట్లు ప్రకటించారు. ప్రయాణికులు ఇది గమనించి సహకరించాలని కోరారు.

News March 18, 2026

విశాఖ: దివ్యాంగులకు ఉచిత బస్సు పథకం ప్రారంభం

image

దివ్యాంగుల కోసం ఏపీ ప్రభుత్వం దివ్యాంగ శక్తి పథకాన్ని అమలు చేస్తూ ఉచిత బస్సు సౌకర్యాన్ని బుధవారం ప్రారంభించింది. విశాఖలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్.మాధవ్ పాల్గొని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగుల రవాణా సమస్యలు తగ్గి, సామాజిక-ఆర్థిక భాగస్వామ్యం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.