News December 23, 2025
పిల్లలను అమ్మే ముఠా కోసం 5 ప్రత్యేక బృందాలతో సిట్ ఏర్పాటు

విజయవాడలో పిల్లలను అమ్మే ముఠా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో లోతైన విచారణ కోసం నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేశారు. అడ్మిన్ డీసీపీ ఆధ్వర్యంలో 5 ప్రత్యేక బృందాలతో సిట్ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇప్పటికే ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేశారు. ఢిల్లీ, ముంబైతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విచారణ చేపట్టేందుకు సిట్ను నియమించామన్నారు.
Similar News
News December 29, 2025
ఆరావళి కొండల నిర్వచనంపై సుప్రీంకోర్టు స్టే!

ఆరావళి కొండల కొత్త నిర్వచనంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనివల్ల పర్యావరణానికి ముప్పు కలుగుతుందన్న ఆందోళనల నేపథ్యంలో పాత ఉత్తర్వులను ప్రస్తుతానికి నిలిపివేసింది. ఈ అంశాన్ని పరిశీలించేందుకు ఒక స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ బెంచ్ తెలిపింది. తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేస్తూ అప్పటివరకు మైనింగ్ పనులు ఆపాలని రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చింది.
News December 29, 2025
ఈ నొప్పులతో థైరాయిడ్ను ముందుగానే గుర్తించొచ్చు

శరీరంలో కొన్నిభాగాల్లో వచ్చే నొప్పులు థైరాయిడ్ అసమతుల్యతకు సూచన అని నిపుణులు అంటున్నారు. సాధారణంగా థైరాయిడ్ హార్మోన్లలో అసమతుల్యత ఉంటే ఎముకలను బలహీనపరుస్తుంది. ఇది వివిధ ప్రదేశాలలో నొప్పికి దారితీస్తుంది. మెడ, దవడ, చెవి నొప్పులు తరచూ వస్తుంటే థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం మంచిది. వీటితో పాటు కండరాల నొప్పి, కీళ్లు, మోకాళ్ల నొప్పి ఎక్కువగా వస్తున్నా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News December 29, 2025
మేడారంలో అధికారులకు ఎస్పీ సూచనలు

మేడారం మహా జాతర సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను ఎస్పీ సుధీర్ రామనాథన్ కేకన్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. జాతర సందర్భంగా ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రాంతాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు వివరించారు. ముందస్తు మొక్కులు చెల్లిస్తున్న భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. ఆయన వెంట జిల్లా పోలీసు అధికారులు ఉన్నారు.


