News December 23, 2025
అప్పు చేసి మరీ ఎంజాయ్ చేస్తున్న మన కుర్రకారు.. మరి చైనాలో?

భారత యువత అవసరం కోసమో, ఆస్తుల కోసమో కాకుండా.. ఎంజాయ్ చేయడానికే అప్పులు చేస్తున్నారట. ఈ ఏడాదిలో మన కుర్రకారు తీసుకున్న పర్సనల్ లోన్లలో 27% టూర్ల కోసమేనని తేలినట్లు ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సార్థక్ అహుజా తెలిపారు. మరోవైపు చైనా యువత మాత్రం బంగారం కొంటూ భవిష్యత్తు కోసం జాగ్రత్త పడుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మనవాళ్లేమో రేపటి సంపాదనపై ధీమాతో నేడు అప్పు చేసి మరీ ఖర్చు చేస్తున్నారు.
Similar News
News January 3, 2026
గంజాయి తీసుకుంటూ దొరికిన BJP MLA కుమారుడు

TG: ఈగల్ టీమ్ తనిఖీల్లో BJP ఎమ్మెల్యే కుమారుడు పట్టుబడ్డారు. నానక్రామ్గూడలో నిర్వహించిన తనిఖీల్లో ఏపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి దొరికారు. తనిఖీల సమయంలో గంజాయి తీసుకుంటూ చిక్కిన ఆయనకు టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. ఆయనను ఈగల్ టీమ్ డీఅడిక్షన్ సెంటర్కు తరలించింది.
News January 3, 2026
మీడియా ముందుకు దేవా

TG: రాష్ట్రంలో పెద్దఎత్తున మావోయిస్టులు లొంగిపోయినట్లు DGP శివధర్ రెడ్డి పేర్కొన్నారు. కీలక నేతలు బర్సే దేవా, కంకనాల రాజిరెడ్డి, రేమలతో పాటు మరో 17మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలిపారు. వారు 48 తుపాకులు, 93 మ్యాగ్జిన్లు, 2206 బుల్లెట్స్, రూ.20,30,000 నగదు అప్పగించినట్లు వెల్లడించారు. దేవాపై రూ.75లక్షల రివార్డ్ ఉంది. ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన అగ్రనేత హిడ్మాతో కలిసి దేవా 15 ఏళ్లు పనిచేశారు.
News January 3, 2026
IIIT డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలులో ఉద్యోగాలు

<


