News December 23, 2025
వనపర్తి: ఈనెల 24న ఉమ్మడి శిబిరం.. పెండింగ్ ఖాతాదారులకు అవకాశం..!

పదేళ్లుగా క్లెయిమ్ చేయకుండా ఉండిపోయిన ఖాతాదారుల బ్యాంకు డిపాజిట్లు, బీమా, మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్ షేర్ డబ్బులు తిరిగి పొందేందుకు రిజర్వు బ్యాంక్ మరో అవకాశం కల్పించిందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. కలెక్టరేట్లోని IDOCలో ఈనెల 24న బ్యాంకులు, బీమా సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ బ్రోకరేజ్ సంస్థలతో ఉమ్మడి శిబిరం ఏర్పాటు చేశామని, జిల్లా ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News January 13, 2026
కిటికీకి ఎదురుగా మరో కిటికీ ఉండవచ్చా?

నివాస గృహాలలో ఓ కిటికీకి ఎదురుగా మరో కిటికీ ఉండేలా ప్లాన్ చేసుకుంటే ఆరోగ్యం, ప్రశాంతత సొంతమవుతాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘ఈ నిర్మాణం గాలి ప్రవాహాన్ని మెరుగుపరచి, గదుల ఉష్ణోగ్రత క్రమబద్ధంగా ఉంచుతుంది. సరైన వెలుతురు ప్రసరిస్తుంది. తద్వారా దైవకళతో ఉట్టిపడుతుంది. ఇది పని పట్ల ఏకాగ్రతను పెంచుతుంది. శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తుంది’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 13, 2026
నల్గొండ: కరడుగట్టిన దొంగల అరెస్ట్

నల్గొండ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను పోలీసులు అరెస్ట్ చేసినట్లు అదనపు ఎస్పీ జి.రమేశ్ తెలిపారు. సూర్యాపేట జిల్లాకు చెందిన పాత నేరస్థుడు గునిగంటి మహేశ్, HYDకు చెందిన పాత్లావత్ వినయ్ కొంతకాలంగా దోపిడీలకు పాల్పడుతున్నారు. గతేడాది నవంబర్లో కేతేపల్లి పరిధిలో ఓ మహిళను కత్తితో బెదిరించి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటనలో సాంకేతిక పరిజ్ఞానంతో వీరిని పట్టుకున్నారు.
News January 13, 2026
చైనా మాంజాపై పోలీసు కమిషనర్కు HRC నోటీసులు

TG: గాలిపటాలు ఎగురవేసేందుకు వినియోగిస్తున్న చైనా మాంజా కారణంగా పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారు. తీవ్రంగా గాయపడి కొన్నిచోట్ల పిల్లల ప్రాణాలూ పోతున్నాయి. దీనిపై దాఖలైన ఫిర్యాదుతో తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) సీరియస్గా స్పందించింది. HYD పోలీసు కమిషనర్ సజ్జనార్కు నోటీసులు జారీచేసింది. ఈ ఘటనలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అడ్వకేట్ రామారావు ఇమ్మానేని HRCలో ఈ పిటిషన్ దాఖలు చేశారు.


