News December 23, 2025

సిరిసిల్ల : చలాన్ల ద్వారా రూ.4.28 కోట్ల జరిమానా

image

మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన కేసులు, వాహనాలకు ఈ చలాన్ల ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు 4.28 కోట్ల రూపాయల జరిమానా వసూలు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ మహేష్ బి గితే వెల్లడించారు. 2025లో 12,151 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 1,91,756 ఈ చలాన్ల ద్వారా 4 కోట్ల 28 లక్షల 3 వేల 95 రూపాయల జరిమానా వసూలు చేసినట్లు ఆయన తెలిపారు.

Similar News

News December 26, 2025

మిర్యాలగూడ సబ్ కలెక్టర్ బదిలీ

image

మిర్యాలగూడ డివిజన్ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ బదిలీ అయ్యారు. ఆయనను నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. నారాయణ్ అమిత్ స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు.

News December 26, 2025

NLG: నేడు స్వగ్రామానికి హనుమంతు మృతదేహం

image

ఒడిశాలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన పాక హనుమంతు అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంలలో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు. మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు ఇవాళ ఉదయం వారు ఒడిశాకు వెళ్లారు. హనుమంతు తోబుట్టువులంతా గ్రామానికి చేరుకోనున్నారు. 1960లో జన్మించిన హనుమంతు గ్రామంలో 7వ తరగతి వరకు, చండూరులో 10వ తరగతి వరకు చదివారు. నల్గొండలో డిగ్రీ వరకు చదివారు.

News December 26, 2025

కొత్త ఏడాదిలో ఇవి మారుతాయి!

image

కొత్త ఏడాదిలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి.
*8వ వేతన సంఘం అమలుపై స్పష్టత రానుంది. ఉద్యోగుల జీతాలు పెరిగే ఛాన్స్.
*పలు బ్యాంకుల వడ్డీ రేట్ల తగ్గింపు, సవరించిన FD రేట్లు జనవరి నుంచి అమల్లోకి.
*బ్యాంకింగ్ సర్వీసులకు పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి.
*PM కిసాన్ సాయం పొందేందుకు యూనిక్ ID కార్డ్ విధానం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చే అవకాశం.
*LPG, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు.