News December 23, 2025
పేపర్ లెస్ పరిపాలన అందించాలి: డీఎంహెచ్వో

జిల్లా పరిధిలో ఈ-ఆఫీస్ డిజిటల్ సేవల ద్వారా పేపర్ లెస్ పరిపాలన అందించాలని డీఎంహెచ్వో డా.కృష్ణమూర్తి నాయక్ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం, వేగవంతంగా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ సాంకేతికతను పూర్తిగా అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో భౌతిక ఫైళ్లకు బదులుగా డిజిటల్ ఫైళ్లు నిర్వహించాలన్నారు.
Similar News
News December 25, 2025
రాబోయే ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు: మంత్రి వాకిటి

కొడంగల్లో నూతన సర్పంచుల సన్మాన సభకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాయని, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయని తెలిపారు.
News December 25, 2025
మైలవరంలో ఓ విలాస భవనం.. దీని చరిత్ర మీకు తెలుసా..?

బ్రిటిష్ కాలం నాటి జమీందారీ వ్యవస్థకు గుర్తుగా మైలవరంలోని కోడిగుడ్డు మేడ. 1906లో ప్రారంభమై 1915లో పూర్తయిన ఈ భవనం, 3ఎకరాల స్థలంలో నిర్మించబడింది. సూరానేని వంశీయుల పాలనలో ఉన్న ఈ జమీందారీ వద్ద నుంచి 1970లలో మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు కుటుంబం దీనిని కొనుగోలు చేయగా, 1992లో లకిరెడ్డి హనిమిరెడ్డి, రూ.25,000కు కొనుగోలు చేసి, ఆధునికరించి 2 బురుజులు నిర్మించి నివాసానికి ఉపయోగిస్తున్నారు.
News December 25, 2025
ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమి లీడర్లు విఫలం!

బెంజ్ సర్కిల్ నుంచి పెనమలూరు (ORR) వరకు ఫ్లైఓవర్, అండర్పాస్ల నిర్మాణాలను కాదని, కేవలం సర్వీసు రోడ్లకే NHAI మొగ్గుచూపడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీ చిన్ని వెస్ట్ బైపాస్కు ఫ్లైఓవర్ మంజూరు చేయించుకోగా, కృష్ణా జిల్లా నేతలు పెనమలూరు వరకు ఫ్లై ఓవర్ సాధించడంలో విఫలమయ్యారనే విమర్శలొస్తున్నాయి. ప్రమాదాలు జరుగుతున్న కూడళ్ల వద్ద కనీసం అండర్పాసులైనా నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు.


