News December 23, 2025
ADB: గురుకుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు

తెలంగాణా గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్షను వచ్చే ఏడాది ఫిబ్రవరి 22న నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ జిల్లా సమన్వయధికారి లలిత కుమారి తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. జనవరి 21లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని, ప్రవేశ పరీక్షలో మెరిట్, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ప్రవేశాలు కల్పిస్తామని వెల్లడించారు.
Similar News
News December 25, 2025
ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలి: కలెక్టర్

పెద్దపల్లి: ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న దంత వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష కోరారు. దంత సమస్యలతో ఇబ్బంది పడుతున్న కలెక్టర్ గురువారం జిల్లా ఆసుపత్రిలో రూట్ కెనాల్ చికిత్స చేయించుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పుడు దంతాలను కాపాడే సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లా ప్రజలు ఆసుపత్రి వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
News December 25, 2025
తెలుసా..?: 3 సార్లు ఫెయిలైతే సర్పంచ్ తొలగింపు

తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లో సర్పంచ్లకు అధికారాలతో పాటు విధుల గురించి ప్రస్తావించారు. కేటాయించిన నిధులు సరిగా ఖర్చు చేయకుంటే పాలకవర్గం మొత్తాన్ని రద్దు చేయొచ్చు. ఇక 2 నెలలకు ఓ సారి జరగాల్సిన గ్రామసభలు వరుసగా 3 సార్లు నిర్వహించకపోయినా సర్పంచ్ను తొలగించవచ్చు. ప్రజలకు అవగాహన, చైతన్యం పెరిగిన నేపథ్యంలో పాలకులు ఏ మాత్రం ఆదమరిచి ఉన్నా పదవులు ఊడే అవకాశముంది జాగ్రత్త.
News December 25, 2025
తిరుపతిలో CM పర్యటన ఇలా..!

తిరుపతిలో సీఎం చంద్రబాబు, RSS చీఫ్ మోహన్ భగవత్, కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ శుక్రవారం పర్యటించనున్నారు. ఉదయం 9.35 గంటలకు తిరుపతి ఎస్వీ అగ్రికల్చరల్ కాలేజీ హెలిప్యాడ్కు సీఎం వస్తారు. 10.05 గంటలకు సంస్కృత విద్యాపీఠంలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.10 గంటలకు ఎస్పీ ఆఫీస్ కొత్త బిల్డింగ్ ఓపెన్ చేస్తారు. మధ్యాహ్నం 2.05 గంటలకు తిరిగి ఉండవల్లికి రిటర్న్ అవుతారు.


