News December 23, 2025
ఏమాత్రం పట్టు తప్పినా ప్రాణాలు గాల్లోనే!

రోడ్డు భద్రత నియమాలు పాటించాలని పోలీసులు ఎంతగా మొత్తుకుంటున్నా వాహనదారులు, ప్రయాణికులలో మార్పు రావడం లేదు. ప్రాణాలు పోతాయని తెలిసినా ప్రమాదకర రీతిలో ప్రయాణాలు సాగిస్తూనే ఉన్నారు. సంగారెడ్డి-అకోలా జాతీయ రహదారి 161పై నిబంధనలకు విరుద్ధంగా తుఫాన్ వాహనంపై ఫుట్ బోర్డు మీద నిలబడి ఓ ప్రయాణికుడు అత్యంత ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న దృశ్యమిది. ఏమాత్రం పట్టు తప్పినా ప్రాణాలు గాల్లో కలవడం ఖాయం.
Similar News
News January 14, 2026
డెయిరీఫామ్.. ఈ ఏడాది రూ.3 కోట్ల ఆదాయం లక్ష్యం

గుజరాత్లోని బనస్కాంతకు చెందిన 65 ఏళ్ల మణిబెన్ పాల వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తున్నారు. 2011లో 12 ఆవులతో డెయిరీ ఫామ్ ప్రారంభించారు. ప్రస్తుతం ఫామ్లో 230 ఆవులు, గేదెలున్నాయి. రోజూ 1100 లీటర్లను గ్రామ కోఆపరేటివ్ డెయిరీకి సరఫరా చేస్తూ 2024-25లో 3.47లక్షల లీటర్ల పాలు అమ్మి రూ.1.94 కోట్ల ఆదాయం పొందారు. ఈ ఏడాది రూ.3 కోట్ల ఆదాయమే లక్ష్యమంటున్నారు. ఈమె సక్సెస్ స్టోరీ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News January 14, 2026
UPDATE: ఖమ్మం LIG ఫ్లాట్ల రహదారి సమస్య పరిష్కారం

ఖమ్మం శ్రీరాం నగర్లో హౌసింగ్ బోర్డు నిర్మించిన LIG ఫ్లాట్లలో రహదారి సమస్య ఎట్టకేలకు పరిష్కారమైనట్లు హౌసింగ్ బోర్డు చీఫ్ ఇంజనీర్ రమణా రెడ్డి వెల్లడించారు. కాగా రహదారి విషయంలో ఏర్పడిన సమస్య కారణంగా, అనేక మంది దరఖాస్తు చేయడానికి ముందుకు రాలేదని చెప్పారు. సమస్య పరిష్కారం కావడంతో LIG ఫ్లాట్స్కు JAN 18 వరకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి, 19న లాటరీ ద్వారా ప్లాట్స్ కేటాయిస్తామని పేర్కొన్నారు.
News January 14, 2026
మిర్యాలగూడ జిల్లా డిమాండ్.. మళ్లీ తెరపైకి!

రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనపై సీఎం ప్రకటనతో ఉమ్మడి నల్గొండలో చర్చ మొదలైంది. ప్రధానంగా మిర్యాలగూడను జిల్లాగా చేయాలని స్థానికులు కోరుతున్నారు. గతంలో లోక్సభ స్థానంగా ఉన్న ఈ ప్రాంతం.. పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా ఎంతో అభివృద్ధి చెందిందని గుర్తు చేస్తున్నారు. సాగర్, హుజూర్నగర్, దేవరకొండ ప్రాంతాలతో కలిపి జిల్లాను ఏర్పాటు చేస్తే పరిపాలన సౌలభ్యంతో పాటు ఉపాధి పెరుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారు.


