News December 23, 2025
మోటకొండూరు: పోరాడితేనే హక్కులను సాధించుకోగలం: కవిత

పోరాడితేనే హక్కులను సాధించుకోగలమని తెలంగాణ జన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జన జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా మంగళవారం యాదాద్రి జిల్లా మోటకొండూరులో ఆమె మాట్లాడారు. భూ నిర్వాసితులకు అండగా ఉంటామన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేరలేదన్నారు. రూ.4,000 పెన్షన్, మహిళలకు రూ.2,500 ఆర్థిక సహాయం ఇవ్వలేదన్నారు.
Similar News
News December 26, 2025
TPT: 100 ఏళ్ల క్వాంటం కంప్యూటింగ్పై చర్చ

తిరుపతిలోని NSUలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. సైన్స్ అండ్ టెక్నాలజీపై ఎక్స్ పో జరుగుతుంది. DRDO, CSIR, NIF, MPCST, NRSC, PFI, అటామిక్ ఎనర్జి, ఎర్త్ సైన్స్ తదితర రంగాల్లో 80పైగా ప్రదర్శనలు ఎక్స్ పోలో ఉన్నాయి. 100 ఏళ్ల క్వాంటమ్ కంప్యూటింగ్, పరిశోధనలు, AI& ML అప్లికేషన్లు తదితర అంశాలపై చర్చ జరగనుంది.
News December 26, 2025
నారదుడు ఎప్పుడూ ఎందుకు తిరుగుతుంటాడు?

నారద ముని ఒకచోట నిలకడగా ఉండలేరన్న విషయం మనకు తెలిసిందే. అయితే దీని వెనుక ఒక రహస్యం ఉంది. సృష్టి కార్యంలో భాగంగా దక్ష ప్రజాపతి కుమారులు సంసారంలో పడకుండా, నారదుడు వారికి వైరాగ్యాన్ని బోధించి సన్యాసులుగా మారుస్తాడు. దీనితో కోపించిన దక్షుడు, నారదుడు ఎక్కడా రెండు గడియల కంటే ఎక్కువ సేపు నిలబడకుండా ఉండేలా శాపం ఇస్తాడు. అది లోకకల్యాణానికి దారి తీసింది.
News December 26, 2025
దొంగల ముఠాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన జిల్లా పోలీసులు!

కామారెడ్డి జిల్లాలో వరుస దోపిడీలు, దారి దోపిడీలకు పాల్పడుతున్న ఐదు ముఠాలను ఈ ఏడాది పోలీసులు అరెస్ట్ చేశారు. పార్ది గ్యాంగ్ 1 & 2 లో 11 మందిని అరెస్ట్ చేసి, నలుగురిపై PD యాక్ట్ నమోదు చేశారు. కంజర్ భట్ & గడ్డపార గ్యాంగ్ లో 10 మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి ₹15.45 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడుతున్న ఐదుగురిని పట్టుకుని నగదు, ఫోన్లు సీజ్ చేశారు.


