News December 24, 2025

భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా “స్మార్ట్ కిచెన్” నిర్మించాలి: కలెక్టర్ శ్రీధర్

image

విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన డొక్కా సీతమ్మ స్మార్ట్ కిచెన్ నిర్మాణం భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అధికారులకు సూచించారు. మంగళవారం చెన్నూరు మండలం కొండపేటలో రూ.38 లక్షలతో నిర్మిస్తున్న డొక్కా సీతమ్మ స్మార్ట్ కిచెన్‌ను పరిశీలించారు. ఈ కేంద్రం నుంచి 41 పాఠశాలలకు భోజనం సరఫరా అవుతుందని ఆయన తెలిపారు.

Similar News

News December 28, 2025

కడప: ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న ఉల్లి రైతులు.!

image

నష్టపోయిన ఉల్లి రైతుకు క్వింటాల్‌కు రూ.20ల చొప్పున ప్రభుత్వం సాయం ప్రకటించింది. కడప జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 11,628 ఎకరాల్లో రైతులు ఉల్లి పంటను సాగు చేశారు. వీరపునాయునిపల్లె, మైదుకూరు, దువ్వూరు, వేముల, తొండూరు, వేంపల్లె, ముద్దనూరు మండలాల్లో రైతులు ఉల్లి పంట సాగు చేశారు. పంట చేతికొచ్చిన సమయంలో మార్కెట్లో ధర లేదు. రైతులు పెట్టుబడులు పెట్టి నష్టపోయారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

News December 28, 2025

ప్రొద్దుటూరు: ‘నిర్మాణాలు పూర్తి కాకుండానే బిల్లుల చెల్లింపు’

image

PDTR పేజ్-3 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకుండానే బిల్లులు చెల్లించారు.
*JNR రూ.2.67కోట్లు, పోండ్ల శివశంకర్ రూ.24.79 లక్షలు
*వాసవి ఇన్‌ఫ్రా రూ.31.73 కోట్లు, వినాయక రూ.2.40 కోట్లు
*వెంకటేశ్వర రూ.10.04 కోట్లు, సిరి ఫ్లైయాష్ రూ.1.66 కోట్లు
*తబాసుమ్ బిల్డర్స్ రూ.72.01 లక్షలు, గుర్రం రవి రూ.3.28 కోట్లు
*ఉప్పలపాటి కనకరాజు రూ.38.51లక్షలు, కృష్ణమ్మ రూ.4 కోట్లు
*రవిప్రకాష్ రూ.65 లక్షలు చెల్లింపులు చేశారు.

News December 28, 2025

2025లో కడప జిల్లాలో సంచలన ఘటనలు ఇవే.!

image

▶ విషాదం నింపిన మే నెల.. మే 23న మైలవరం మండలంలో 3ఏళ్ల చిన్నారిపై హత్యాచారం. నిందితుడి ఆత్మహత్య
▶ మే 13న బ్రహ్మంగారిమఠం (M) మల్లెపల్లెలో ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు మృతి
▶ మే 24న గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో లారీ అదుపుతప్పి కారుపై పడటంతో ఐదుగురు మృతి
▶ జులైలో గండికోటలో బాలిక హత్య.. ఇంకా కొలిక్కి రాని కేసు
▶ అక్టోబర్ 5న ప్రొద్దుటూరులో తల్లిని చంపిన కొడుకు
▶ అక్టోబర్ 26న జమ్మలమడుగులో జంట హత్యలు.