News December 24, 2025

నేర నివారణే లక్ష్యంగా పనిచేయాలి: ఎస్పీ విక్రాంత్ పాటిల్

image

కర్నూలు జిల్లాలో నేర నివారణే లక్ష్యంగా పోలీసులు పనిచేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రౌడీషీటర్లపై నిఘా ఉంచి వారి లొకేషన్లను జియో ట్యాగింగ్ చేయాలన్నారు. ఉద్యోగాల మోసాలు, ల్యాండ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దొంగతనాల కేసులను ఛేదించి రికవరీలను పెంచాలని, మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు.

Similar News

News December 29, 2025

కర్నూలు: తిరుమల వెళ్లి వస్తుండగా విషాదం

image

ఒంటిమిట్ట మండలంలోని మట్టంపల్లి-నందలూరు మధ్య ఆదివారం సాయంత్రం పూణే ఎక్స్‌ప్రెస్ రైలుకింద పడి శ్రీనివాసులు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు కడప రైల్వే SI సునీల్ తెలిపారు. మృతుడు కర్నూలు జిల్లా అప్సరి మండలం శంకరంబాడి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో రైలు నుంచి పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు.

News December 28, 2025

విక్రాంత్ పాటిల్ ప్రస్థానం: ఎస్పీ నుంచి డీఐజీ వరకు

image

కర్నూలు ఎస్పీగా సేవలు అందిస్తున్న విక్రాంత్ పాటిల్ 2012 బ్యాచ్ తమిళనాడు క్యాడర్ ఐపీఎస్ అధికారి. ఏపీలో కీలక బాధ్యతలు నిర్వహించి డీఐజీగా పదోన్నతి పొందారు. విజయనగరం అదనపు ఎస్పీగా కెరీర్ ప్రారంభించి చిత్తూరు రైల్వే ఎస్పీగా, విజయవాడ డీసీపీగా సేవలందించారు. పార్వతీపురం, కాకినాడ ఎస్పీగా పని చేశారు. ప్రస్తుతం కర్నూలు ఎస్పీగా ఉన్న ఆయనకు డీఐజీగా పదోన్నతి లభించడంపై పోలీసు వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

News December 28, 2025

14వ స్థానంలో కర్నూలు జిల్లా.!

image

అన్ని పోలింగ్ కేంద్రాలకు రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను తక్షణమే నియమించుకోవాలని కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిరి శనివారం ఆదేశించారు. ఓటర్ల జాబితా సవరణలో BLOలతో సమన్వయంగా పనిచేయాలని సూచించారు. ఓటర్ల మ్యాపింగ్‌లో జిల్లా రాష్ట్రంలో 14వ స్థానంలో ఉందని, జనవరి చివరికి గ్రామాల్లో 75%, పట్టణాల్లో 85% మ్యాపింగ్ పూర్తిచేస్తామన్నారు. నిర్లక్ష్యం వహించిన ఇద్దరు BLOలను సస్పెండ్ చేశామన్నారు.