News December 24, 2025

కేయూ పరిధిలో సెమిస్టర్ పరీక్షలు వాయిదా

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో జనవరి 3 నుంచి జరగాల్సిన పీజీ 3వ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి కట్ల రాజేందర్ తెలిపారు. ఈ తేదీల్లో యూజీసీ నెట్‌, టీజీ సెట్‌, టీజీ టెట్‌ పరీక్షలు ఉన్నందున విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు వాయిదా వేసినట్లు చెప్పారు. సవరించిన పరీక్షల షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.

Similar News

News December 30, 2025

ప్రగతి పథంలో విశాఖ విమానాశ్రయం

image

విశాఖ విమానాశ్రయం 2025లో గణనీయమైన ప్రగతిని సాధించింది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ మధ్య 27 లక్షలకు పైగా ప్రయాణికుల రాకపోకలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 4,902.876 మెట్రిక్ టన్నుల దేశీయ సరకు రవాణా చేశారు. గత ఏడాదితో పోలిస్తే విమానాశ్రయ కార్యకలాపాల్లో 9.29% వృద్ధి నమోదైంది. కస్టమర్ సంతృప్తి విషయంలో దేశవ్యాప్తంగా విశాఖ విమానాశ్రయం 9వ స్థానంలో నిలిచింది.

News December 30, 2025

వరంగల్: నామినేటెడ్ పదవులపై నేతల్లో ఆశలు..!

image

పీఏసీఎస్, డీసీసీబీ పాలకవర్గాల రద్దుతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ కోలాహలం నెలకొంది. ఈ నెల 19న వచ్చిన ఉత్తర్వులు ఆశావహుల్లో ఉత్సాహం నింపాయి. జిల్లాలో 99 పీఏసీఎస్‌లు ఉండగా వాటి సంఖ్య పెంచే యోచన ఉంది. డీసీసీబీ ఛైర్మన్ పదవులు ఒకటి నుంచి ఆరుకు పెరిగే అవకాశం. ఈసారి ఎన్నికల బదులు నామినేటెడ్ విధానంలో పదవులు భర్తీ చేయనుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది.

News December 30, 2025

సంగారెడ్డి జిల్లాలో యూరియా కొరత లేదు: కలెక్టర్

image

సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుత యాసంగి (రబీ) సీజన్‌లో పంటల సాగు కోసం రైతుల అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. రైతులు ఎవరూ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఆమె భరోసా కల్పించారు. యూరియాకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సాఫీగా ఎరువుల పంపిణీ జరిగేలా ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.