News December 24, 2025
సంగారెడ్డి: పీఎంశ్రీ పాఠశాలల్లో ‘బాలల రక్షణ’ అవగాహన

సంగారెడ్డి జిల్లాలోని 44 పీఎంశ్రీ పాఠశాలల్లో జనవరి 8 నుంచి 23 వరకు బాలల సంరక్షణ, భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి తెలిపారు. విద్యార్థుల భద్రతే ధ్యేయంగా ప్రతిరోజూ వైవిధ్య భరిత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పిల్లలకు తమ హక్కులు, రక్షణ చట్టాలు, ఆపద సమయంలో ఆదుకునే టోల్ ఫ్రీ నంబర్లపై సమగ్ర అవగాహన కల్పిస్తామని వెల్లడించారు.
Similar News
News December 25, 2025
GNT: ORR కోసం భూసేకరణకు ప్రభుత్వం రెడీ.!

అమరావతి ORR కోసం భూసేకరణకు ప్రభుత్వం రెడీ అయింది. కేంద్రం ఇప్పటివరకు గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఏలూరు జిల్లాలకు గెజిట్ విడుదల చేసింది. 4 జిల్లాలో మొత్తం 189.90 Km మేర ORR నిర్మించనున్నారు. గుంటూరు జిల్లాలో 67.65Km, పల్నాడులో 17.23Km మేర నిర్మించనున్నారు. ORR ప్రాజెక్టు డీపీఆర్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించేలోపు భూసేకరణను కొలిక్కి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
News December 25, 2025
DGP ఎంపికపై కీలక ఆదేశాలు

TG: తాత్కాలిక పద్ధతిలో రాష్ట్ర DGPగా శివధర్ రెడ్డి నియామకం చెల్లదంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన నియామక ఉత్తర్వుల రద్దుకు నిరాకరించింది. అయితే DGP ఎంపిక ప్రక్రియను కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించింది. ఇందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేసింది. సీనియర్ ఐపీఎస్ల జాబితాను UPSCకి పంపించిన తర్వాత ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
News December 25, 2025
హైదరాబాద్లో డేంజర్ బెల్స్..

HYDలో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్కి చేరింది. చలికాలం పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతోంది. డబుల్ డిజిట్లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ గురువారం తెల్లవారుజామున 240కి చేరింది. శ్వాసకోస వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలు అని డాక్టర్లు సూచిస్తున్నారు. తెల్లాపూర్ ఏరియాలో 422గా నమోదు కావటం గమనర్హం.
SHARE IT


