News December 24, 2025

ఉద్యాన సాగు విస్తరణకు జిల్లాలో కొత్త ప్రణాళికలు: కలెక్టర్

image

ఉద్యాన పంటల విస్తరణ దిశగా జిల్లా కొత్త అడుగులు వేస్తోంది. జిల్లాలో కొత్తగా 10 వేల ఎకరాల్లో ఉద్యాన సాగుకు విజయనగరం కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ప్రణాళికలు రూపొందించారు. రబీ సీజన్‌లో 4,000 ఎకరాలు, ఖరీఫ్‌లో 6,000 ఎకరాలు అదనంగా సాగులోకి తేవాలని ప్రతిపాదించారు. ఈ అంశాలపై బుధవారం డీఆర్డీఏ, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

Similar News

News December 24, 2025

ఎం-కేడ్ పథకంతో పెద్దగెడ్డ ప్రాజెక్టు అభివృద్ధి: VZM కలెక్టర్

image

ఎం-కేడ్ పథకం ద్వారా పెద్దగెడ్డ ప్రాజెక్టును ఆధునీకరించేందుకు రూ.78.2 కోట్ల ప్రతిపాదనలు పంపినట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి బుధవారం తెలిపారు. కేంద్ర, రాష్ట్ర నిధుల వాటా 60:40గా ఉండనుందన్నారు. ప్రాజెక్టు ద్వారా 7,567 ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుందని, భూగర్భ పైప్‌లైన్లు, సెన్సార్‌లు, జీపీఎస్ సాయంతో ఆధునికంగా నీటి పంపిణీ చేపడతామన్నారు. పాచిపెంట, రామభద్రపురం మండలాలకు సాగునీటి లబ్ధి చేకూరనుందన్నారు.

News December 24, 2025

పారా యూత్ ఏషియన్ గోల్డ్ మెడలిస్ట్‌ను సత్కరించిన మంత్రి కొండపల్లి

image

దుబాయ్ వేదికగా ఇటీవల జరిగిన యూత్ ఏషియన్ పారా గేమ్స్ -2025 పోటీల్లో బాడ్మింటన్‌లో జిల్లాకు చెందిన పారా క్రీడాకారుడు పొట్నూరు ప్రేమ్ చంద్ గోల్డ్ మెడల్ సాధించారు. ఈసందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను తన క్యాంపు కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. క్రీడాకారుడుని మంత్రి శాలువాతో సత్కరించి, అభినందించారు.

News December 24, 2025

అభివృద్ధి ప్రాజెక్టుల భూసేకరణను పూర్తి చేయాలి: VZM కలెక్టర్

image

జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల భూసేకరణను పూర్తి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమీక్షలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, జాతీయ రహదారి–516(B), రైల్వే లైన్ల విస్తరణ, ఐటీ పార్కులు, స్టీల్ ప్లాంట్, తదితర ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిపై సమీక్షించారు. గిరిజన విశ్వవిద్యాలయం వద్ద విద్యుత్ లైన్లు వెంటనే తొలగించాలని ఆదేశించారు.