News December 24, 2025

1.31 లక్షల మంది రైతులకు వ్యవసాయ పరికరాలు: తుమ్మల

image

TG: విపక్ష నేతల మాటలతో యాప్ అమలులో లేని జిల్లాల్లో రైతులు యూరియా ఎక్కువ కొంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎరువులపై విపక్షం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. త్వరలో రాష్ట్రమంతా యాప్ అమలు చేస్తామన్నారు. CM ఆదేశాలతో రైతు యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు. దీనిద్వారా 1.31 లక్షల మంది రైతులకు వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై అందిస్తామని చెప్పారు.

Similar News

News December 29, 2025

11 నెలల్లో SCRకు రూ.19,314 కోట్ల ఆదాయం

image

ఈ ఏడాది జనవరి-నవంబర్ మధ్య దక్షిణ మధ్య రైల్వే(SCR)కు రూ.19,314 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే(రూ.18,831 కోట్లు) ఇది రూ.483 కోట్లు అధికమని పేర్కొన్నారు. రైళ్ల రద్దీని తగ్గించేందుకు చర్లపల్లి టెర్మినల్‌ను అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. మరోవైపు సంక్రాంతి రద్దీ నేపథ్యంలో JAN 7-12 వరకు మరో 11 ప్రత్యేక రైళ్ల బుకింగ్ ఇవాళ ఉ.8 గంటలకు మొదలుకానుంది.

News December 29, 2025

RSS అల్‌ఖైదా లాంటిది: మాణికం ఠాగూర్

image

RSSను ఉగ్ర సంస్థ అల్‌ఖైదాతో పోలుస్తూ కాంగ్రెస్ MP మాణికం ఠాగూర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘RSS విద్వేషాన్ని వ్యాప్తి చేసే సంస్థ. అల్‌ఖైదా లాంటిది. దాని నుంచి <<18686086>>నేర్చుకోవడానికి<<>> ఏమీ లేదు. 140 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ ప్రజలను ఏకతాటిపైకి తెచ్చింది. ప్రజా ఉద్యమంగా పార్టీని గాంధీ మార్చారు. అలాంటి పార్టీ ఈ సంస్థ నుంచి నేర్చుకోవాలా?’ అని ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్ హద్దు దాటుతోందని BJP మండిపడింది.

News December 29, 2025

డెలివరీ తర్వాత ఈ సమస్య వస్తోందా?

image

కొంతమందిలో డెలివరీ తర్వాత నవ్వినా, తుమ్మినా, దగ్గినా, ఇతర ఒత్తిడికరమైన పనులు చేసినా మూత్రాశయం నియంత్రణ కోల్పోతుంది. దీంతో మూత్రం లీక్ అవుతుంది. హార్మోన్లు, టిష్యూల లాక్సిటీ వలన ఇలా జరుగుతుంది. బ్లాడర్ గోడకు సపోర్ట్‌గా ఉండే ఈ టిష్యూలు డెలివరీ టైంలో దెబ్బతింటాయి. సాధారణంగా కొంత కాలానికి సమస్య తగ్గుతుంది. తగ్గకపోతే ఇంట్లోనే కెగెల్ వ్యాయామాలు చెయ్యాలి. అప్పటికీ సమస్య ఉంటే వైద్యులను సంప్రదించాలి.