News April 24, 2024
ఉమ్మడి విజయనగరం జిల్లాలలో బాలికలదే పైచేయి

➤ పార్వతీపురం మన్యం జిల్లాలో 5,099 మంది బాలురు పరీక్ష రాయగా.. 95.33శాతంతో 4,861 మంది పాసయ్యారు. 5,344 మంది బాలికలు పరీక్ష రాయగా 97.36శాతంతో 5,203 మంది ఉత్తీర్ణత సాధించారు.
➤ విజయనగరం జిల్లాలో 11,868 మంది బాలురు పరీక్ష రాయగా.. 89.91శాతంతో 11,081 మంది పాసయ్యారు. 11,822 మంది బాలికలు పరీక్ష రాయగా 93.73శాతంతో 11,081 మంది ఉత్తీర్ణత సాధించారు.
Similar News
News July 11, 2025
అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన

విజయనగరంలోని పోలీసు సంక్షేమ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి SP వకుల్ జిందల్ గురువారం శంకుస్థాపన చేశారు. రెండు అంతస్తుల్లో నాలుగు తరగతి గదుల నిర్మాణానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో తక్కువ ఫీజులతో పోలీసుల పిల్లలకు, ఇతర విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని భవనాలు నిర్మిస్తున్నామన్నారు.
News July 10, 2025
VZM: 2,232 పాఠశాలలు, కాలేజీల్లో మీటింగ్

విజయనగరం జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ గురువారం జరిగింది. జిల్లాలోని 2,232 పాఠశాలల్లో 2,10,377 మంది విద్యార్ధులు వారి తల్లిదండ్రులతో కలసి పాల్గొన్నారు. అలాగే జిల్లాలోని 180 జూనియర్ కళాశాల్లోనూ ఈ మీటింగ్ జరిగింది. విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు టీచర్లు, లెక్చరర్లు వివరించారు..
News July 10, 2025
VZM: అభ్యంతరాలు ఉంటే చెప్పండి

విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను ఆన్లైన్లో పొందుపరిచామని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ పద్మలీల తెలిపారు. 20 విభాగాల్లో 91 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. 12 విభాగాలకు సంబంధించి స్పీకింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. జాబితా https://vizianagaram.nic.inలో అందుబాటులో ఉందని, అభ్యంతరాలు ఉంటే చెప్పాలని ఆమె కోరారు.